LIVE
Singapore: సింగపూర్‌లో ఘనంగా 'మీట్ & గ్రీట్' – ప్రవాసాంధ్రులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆత్మీయ భేటీ!  •  Home Made Foods: అమ్మమ్మల కాలం నాటి యూషం... కారం, పచ్చిమిర్చి లేకుండానే కమ్మటి వంటకం!!  •  SIR 2026: మీ మొబైల్‌లోనే ఓటరు ఎన్యుమరేషన్ చేసుకోండిలా... పూర్తి వివరాలు!  •  Gold Price Today: ఆభరణాల ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..!  •  Basavatarakam Hospital: క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం.. 25 ఏళ్ల సేవలో బసవతారకం ఆస్పత్రి!  •  Cyber Security: డిజిటల్ దొంగల నుంచి మీ డబ్బు సేఫ్ గా ఉండాలా? ఈ 5 సెట్టింగ్స్ వెంటనే మార్చేయండి!  •  AP CRDA: అమరావతిలో ఆర్బీఐ బిగ్ ప్లాన్... మూడు ఎకరాల భూమి అప్పగించిన ఏపీసీఆర్డీఏ!  •  Pawan Kalyan: భారత నాగరికతలో యోగా ఒక అంతర్భాగం.. పవన్ కల్యాణ్ యోగా దినోత్సవ పోస్ట్ నెట్టింట వైరల్!  •  Amaravati Bank Street: అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్.. 13 భారీ బ్యాంకులతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ షురూ!  •  Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... ఆ మూడు గంటలే కీలకం!!  • 
⚡ BREAKING
Andhra Pradesh

TDP: రామాపురంలో వైకాపాకు షాక్.. టీడీపీలోకి చేరిన పలువురు కార్యకర్తలు!

TDP: రామాపురం మండలంలో వైకాపాకు చెందిన పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆదివారం ఈ చేరికలు జరిగాయి.

TDP
TDP

అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై టీడీపీలో చేరిన వైకాపా శ్రేణులు..

అన్నమయ్య జిల్లాలో టీడీపీ బలోపేతం.. పలువురు వైకాపా నేతల చేరిక..

అన్నమయ్య జిల్లా: రామాపురం మండలంలో వైకాపాకు చెందిన పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆదివారం ఈ చేరికలు జరిగాయి.

రామాపురం మండలంలోని నల్లగుట్టపల్లె, చిట్లూరు గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మండల నాయకుడు పప్పిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నల్లగుట్టపల్లెకు చెందిన అయోధ్యపురం సుకుమార్ రెడ్డి, చిట్లూరు గ్రామానికి చెందిన అర్జునుడు సహా పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం కలిసి పనిచేద్దామని, ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Be the first to react

More Coverage