LIVE
NEET: నీట్ రీ ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎన్టీఏ కీలక సూచనలు!  •  EPFO UPdates: ఉద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్‌.. ఈపీఎఫ్‌వో 3.0 విప్లవం.. కొత్త పీఎఫ్ సర్వీస్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే!  •  Ongole: ఒంగోలులో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాలు!  •  Modi: ఫ్రెంచ్ వ్యాపార ప్రముఖులతో ప్రధాని మోదీ కీలక సమావేశాలు!  •  Minister Narayana: ఘన వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం కోసం మలేషియాకు చేరుకున్న మంత్రి నారాయణ!  •  Himachal: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి వేచి ఉన్న భక్తులు!  • 
Andhra Pradesh

Ongole: ఒంగోలులో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాలు!

Ongole: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని ఎస్‌జీవీఎస్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా మంత్రులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Kasthuri S 2 min read
TDP
TDP

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన మంత్రులు.. భారీగా పాల్గొన్న ప్రజలు..

ఎస్‌జీవీఎస్ కన్వెన్షన్‌లో ప్రభుత్వ విజయాలను ఆవిష్కరించిన మంత్రులు..

ఒంగోలు: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని ఎస్‌జీవీఎస్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా మంత్రులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలను వివరించేందుకు ఈ విజయోత్సవాలను నిర్వహించారు.

ఈ వేడుకలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

ఎస్‌జీవీఎస్ కన్వెన్షన్ ప్రాంగణంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లలో పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రదర్శించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు స్టాళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిని జిల్లా కలెక్టర్ రాజాబాబు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు ప్రధాన లక్ష్యాలుగా తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

విజయోత్సవ వేడుకల్లో భాగంగా జలధార – జలహారతి, జల సురక్షా మాసం, రెండేళ్ల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2.0 వంటి పథకాలు లక్షలాది కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రాంగణంలో ప్రజలు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడంతో ఎస్‌జీవీఎస్ కన్వెన్షన్ హాల్ పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే వేదికగా ఈ విజయోత్సవ వేడుక నిలిచింది.

Be the first to react

More Coverage

High Court: ఏపీలో చర్చనీయాంశంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు!

High Court: ఏపీలో చర్చనీయాంశంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు!

High Court:: ఆంధ్రప్రదేశ్‌లో గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. సాయికృష్ణ ఎ…

Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!

Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!

Chandrababu: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేందుకు ప్రతి ప్రభుత్వ…

Chandrababu: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా పంటల సాగు విధానాలు రూపొందించాలి.. సీఎం చంద్రబాబు సూచనలు!

Chandrababu: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా పంటల సాగు విధానాలు రూపొందించాలి.. సీఎం చంద్రబాబు సూచనలు!

Chandrababu: రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అనుకూలంగ…