LIVE
Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగింపు.. భారత్-అంతర్జాతీయ సంబంధాలపై కీలక చర్చలు!  •  Nara Lokesh: కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం!  •  Weight Loss: చుక్క నూనె లేకుండా నోరూరించే చికెన్ కర్రీ.. బరువు తగ్గడానికి బెస్ట్ డైట్!  •  Land Regestraions: బిగ్ అలర్ట్.. ఆ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్!  •  Talliki Vandanam: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు... లోకేష్ కీలక ఆదేశాలు!  •  AP Development: మైసూర్ జేఎస్‌ఎస్ సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ ప్రాంతానికి మహర్దశ... భూసేకరణ షురూ!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్ విత్‌డ్రా!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!  •  APSDMA: ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసిన APSDMA!  •  Movie Review: ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ... అమ్మ జీవితానికి రెండో అవకాశం.. హృదయాలను కదిలిస్తున్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం!  • 
Andhra Pradesh

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగంగా సాగేందుకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.

Kasthuri S 1 min read
Chandrababu
Chandrababu

ఏపీలో రుణ వితరణ 137 శాతం.. దక్షిణాదిలో ముందంజలో రాష్ట్రం..

2025-26లో వ్యవసాయ రంగానికి రూ.3.86 లక్షల కోట్ల రుణాలు: బ్యాంకర్లు..

అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగంగా సాగేందుకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో బ్యాంకర్లతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికపై చర్చ జరిగింది. వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), స్వయం సహాయక సంఘాలు, కౌలు రైతులకు అందుతున్న రుణాలపై సీఎం సమీక్షించారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వివిధ రంగాలకు బ్యాంకులు అందించిన రుణాల వివరాలను సమావేశంలో అధికారులు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి రూ.3,86,249 కోట్ల మేర రుణాలు అందించినట్లు బ్యాంకర్లు తెలిపారు. అలాగే ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1,17,357 కోట్లు, ప్రాధాన్యతా రంగాలకు రూ.5,19,693 కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు.

దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రుణాల పంపిణీ మెరుగ్గా ఉందని బ్యాంకర్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రుణ వితరణ స్థాయి 137 శాతంగా ఉన్నట్లు తెలిపారు.

రైతులు, వ్యాపారులు, యువత, చిన్న పరిశ్రమలకు అవసరమైన ఆర్థిక సహాయం అందేలా బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి బ్యాంకింగ్ రంగం కీలక భాగస్వామిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ ఆశీష్ పాండే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నీలమ్ అగ్రవాల్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ ఏఓ బషీర్, నాబార్డ్ జీఎం కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Be the first to react

More Coverage

Malaysia: మలేషియాలో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన.. వ్యర్థాల నిర్వహణ, గృహ నిర్మాణ విధానాలపై అధ్యయనం!

Malaysia: మలేషియాలో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన.. వ్యర్థాల నిర్వహణ, గృహ నిర్మాణ విధానాలపై అధ్యయనం!

Malaysia: మలేషియా పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పలు కీలక ప్రాజెక్టులను పరిశ…