LIVE
Nara Lokesh: కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం!  •  Weight Loss: చుక్క నూనె లేకుండా నోరూరించే చికెన్ కర్రీ.. బరువు తగ్గడానికి బెస్ట్ డైట్!  •  Land Regestraions: బిగ్ అలర్ట్.. ఆ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్!  •  Talliki Vandanam: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు... లోకేష్ కీలక ఆదేశాలు!  •  AP Development: మైసూర్ జేఎస్‌ఎస్ సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ ప్రాంతానికి మహర్దశ... భూసేకరణ షురూ!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్ విత్‌డ్రా!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!  •  APSDMA: ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసిన APSDMA!  •  Movie Review: ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ... అమ్మ జీవితానికి రెండో అవకాశం.. హృదయాలను కదిలిస్తున్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం!  •  TTD Updates: భక్తులకు గుడ్ న్యూస్... రూ. 10,500 అవసరం లేదు.. కేవలం రూ. 120 కే శ్రీవారి దర్శనం!  • 
Andhra Pradesh

Minister Anam: ఆత్మకూరు అభివృద్ధికి రూ.14.90 కోట్ల అమృత్ 2.0 పనులకు శ్రీకారం!

Minister Anam: ఆత్మకూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పర్యటనలో భాగంగా పేరారెడ్డిపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద రూ.14.90 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

Kasthuri S 1 min read
Minister Anam
Minister Anam

తాగునీరు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..

ఆత్మకూరులో రూ.8.98 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పనులు ప్రారంభం..

ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పర్యటనలో భాగంగా పేరారెడ్డిపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద రూ.14.90 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించేందుకు రూ.8.98 కోట్లతో చేపట్టనున్న నీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 2.0 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం (WTP), 750 కిలోలీటర్ల సామర్థ్యంతో GLSR నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళిక రూపొందించారు.

అలాగే బలహీన వర్గాల కాలనీల అభివృద్ధికి రూ.3.87 కోట్లతో మౌలిక వసతుల పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 1,471 గృహాలకు తాగునీటి కనెక్షన్లు కల్పించడంతో పాటు కొత్త పైప్‌లైన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఆత్మకూరు చెరువు పునరుద్ధరణకు రూ.2.10 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఆత్మకూరు బైపాస్ 4 లైన్ల రహదారి నిర్మాణ పనులు రూ.8 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని మంత్రి ఆనం తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి మరో రూ.2 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆత్మకూరు మున్సిపాలిటీని వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు కల్పించి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.

Be the first to react

More Coverage

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగంగా సాగేందుకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాల…

Malaysia: మలేషియాలో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన.. వ్యర్థాల నిర్వహణ, గృహ నిర్మాణ విధానాలపై అధ్యయనం!

Malaysia: మలేషియాలో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన.. వ్యర్థాల నిర్వహణ, గృహ నిర్మాణ విధానాలపై అధ్యయనం!

Malaysia: మలేషియా పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పలు కీలక ప్రాజెక్టులను పరిశ…