Malaysia: మలేషియాలో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన.. వ్యర్థాల నిర్వహణ, గృహ నిర్మాణ విధానాలపై అధ్యయనం!
Malaysia: మలేషియా పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పలు కీలక ప్రాజెక్టులను పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం వంటి రంగాల్లో మలేషియా అనుసరిస్తున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేశారు.
మలేషియా అభివృద్ధి నమూనాలపై దృష్టి.. అత్యుత్తమ పద్ధతులను ఏపీకి తీసుకురావడమే లక్ష్యం..
బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ సందర్శించిన మంత్రి నారాయణ.. ఆధునిక వ్యర్థాల నిర్వహణపై పరిశీలన..
మలేషియా: మలేషియా పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పలు కీలక ప్రాజెక్టులను పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం వంటి రంగాల్లో మలేషియా అనుసరిస్తున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేశారు.
మంత్రి నారాయణ సెలాంగోర్ రాష్ట్రంలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ను సందర్శించారు. ఇది మలేషియాలోనే అతిపెద్ద శానిటరీ ల్యాండ్ఫిల్ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడ ఘన వ్యర్థాలను పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ఎలా నిర్వహిస్తున్నారో అధికారులు మంత్రికి వివరించారు.
వ్యర్థాలను పూడ్చిపెట్టే ప్రక్రియలో భూమి, నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆధునిక సాంకేతిక విధానాలను మంత్రి పరిశీలించారు. మలేషియాలో అమలు చేస్తున్న ఈ పద్ధతులను ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరాలకు అనుగుణంగా అమలు చేసే అవకాశాలపై మంత్రి దృష్టి సారించారు.
పర్యటనలో భాగంగా సాయంత్రం బెర్జయ గ్రూప్ నిర్మిస్తున్న హౌసింగ్ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారు. తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇళ్ల నిర్మాణంలో ఆ సంస్థ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు.
అలాగే సన్ వే, గముడా ప్రాజెక్టుల ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ రంగాల్లో మలేషియాలోని అనుభవాలను తెలుసుకుని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధానాలను రూపొందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
Be the first to react