LIVE
Nara Lokesh: కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం!  •  Weight Loss: చుక్క నూనె లేకుండా నోరూరించే చికెన్ కర్రీ.. బరువు తగ్గడానికి బెస్ట్ డైట్!  •  Land Regestraions: బిగ్ అలర్ట్.. ఆ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్!  •  Talliki Vandanam: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు... లోకేష్ కీలక ఆదేశాలు!  •  AP Development: మైసూర్ జేఎస్‌ఎస్ సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ ప్రాంతానికి మహర్దశ... భూసేకరణ షురూ!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్ విత్‌డ్రా!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!  •  APSDMA: ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసిన APSDMA!  •  Movie Review: ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ... అమ్మ జీవితానికి రెండో అవకాశం.. హృదయాలను కదిలిస్తున్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం!  •  TTD Updates: భక్తులకు గుడ్ న్యూస్... రూ. 10,500 అవసరం లేదు.. కేవలం రూ. 120 కే శ్రీవారి దర్శనం!  • 
Devotional

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

Kasthuri S 1 min read
Tirumala
Tirumala

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. శిలాతోరణం వరకు క్యూలైన్..

తిరుమలలో భారీ రద్దీ.. ఉచిత దర్శనానికి ఒక రోజు వేచి ఉండాల్సిందే..

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు సుమారు 22 నుంచి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 నుంచి 8 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

ఇదిలా ఉండగా, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,703గా నమోదైంది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ 37,581 మంది తలనీలాలు సమర్పించారు.

శ్రీవారి హుండీ ఆదాయం ద్వారా నిన్న రూ.4.02 కోట్లు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల కోసం నిర్వహిస్తున్న లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా కొనసాగాయి. నిన్న మొత్తం 4.34 లక్షల లడ్డూలు విక్రయించారు.

అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా నిన్న 2.42 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించారు. తిరుమలకు వచ్చిన భక్తులకు వైద్య సదుపాయాలు అందించగా, నిన్న 3,402 మంది భక్తులు వైద్య చికిత్స పొందారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Be the first to react

More Coverage

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగు…