NEET: నీట్ రీ ఎగ్జామ్కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎన్టీఏ కీలక సూచనలు!
NEET: నీట్ యూజీ 2026 పరీక్షకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులకు కీలక సూచనలు చేసింది. ఏడాది మొత్తం కష్టపడి సిద్ధమైన విద్యార్థులు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరుకావాలని ఎన్టీఏ సూచించింది.
ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచన.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు..
నీట్ అభ్యర్థుల మానసిక ఆరోగ్యానికి మానస్ హెల్ప్లైన్ అందుబాటులో..
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్షకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులకు కీలక సూచనలు చేసింది. ఏడాది మొత్తం కష్టపడి సిద్ధమైన విద్యార్థులు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరుకావాలని ఎన్టీఏ సూచించింది.
విద్యార్థులు తమ శ్రమపై నమ్మకం ఉంచి, చివరి రోజుల్లో మంచి విశ్రాంతి తీసుకోవాలని ఎన్టీఏ తెలిపింది. పరీక్షలో తమ ఉత్తమ ప్రతిభను చూపించేందుకు మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని పేర్కొంది.
నీట్ రీ ఎగ్జామ్ను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సహకారంతో పరీక్షా కేంద్రాల్లో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ స్పష్టం చేసింది. మోసపూరిత చర్యలు లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నిజాయితీగా పరీక్ష రాసే విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యమని పేర్కొంది.
పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొనే విద్యార్థుల కోసం మానసిక ఆరోగ్య సహాయం అందుబాటులో ఉందని ఎన్టీఏ తెలిపింది. అవసరమైన విద్యార్థులు మానస్ హెల్ప్లైన్ 14416 ద్వారా సహాయం పొందవచ్చని సూచించింది.
విద్యార్థుల్లో గందరగోళం సృష్టించే తప్పుడు సమాచారం, వదంతులను నమ్మవద్దని ఎన్టీఏ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పరీక్ష వాయిదా పడుతుందనే ప్రచారాలను నమ్మకుండా, ఎన్టీఏ అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించింది.
నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. విద్యార్థులు ధైర్యంగా పరీక్షకు హాజరై తమ ప్రతిభను నిరూపించుకోవాలని కోరింది.
Be the first to react