ఖాకీబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తారా?!
రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో టిడిపి సానుభూతిపరులైన మత్స్యకారులను వైసిపిలో చేరాలి లేదా రూ.2లక్షలు కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో బెస్తసోదరుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వైసిపి నేతలకు తొత్తుగా మారి దుర్గారావుపై తప్పుడు కేసు బనాయించడమే గాక పార్టీ మారాలని వత్తిడిచేయడం, ఆత్మహత్యకు పురిగొల్పడం యావత్ పోలీసు శాఖకే మాయనిమచ్చ. ఖాకీబట్టలు వేసుకొని వైసిపి నేతలకు ఊడిగం చేయడం దారుణం. దేశంలో మరెక్కడైనా ఇలాంటి విపరీతపోకడలు ఉన్నాయా? బిసి సోదరుడి మరణానికి కారకుడైన ఎస్ఐ శ్రీహరి వంటి పోలీసులు మరికొద్దిరోజుల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో కఠినచర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన దుర్గారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది అని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ తెలిపారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి