LIVE
ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  • 
NRI

Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!

Yogandhra: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది.

Kasthuri S 1 min read
Yogandhra
Yogandhra

ఆరోగ్యమే మహాభాగ్యం.. యోగాతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన యోగాంధ్ర..

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగ సాధన..

నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొని యోగాసనాలు వేశారు.

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు, యోగా సాధకులు హాజరై సామూహికంగా యోగ సాధన చేశారు. ఆలయ ప్రాంగణం యోగాభ్యాసంతో ఆధ్యాత్మికత, ఆరోగ్య సందేశంతో సందడిగా మారింది.

ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగ సాధన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ప్రాచీన వారసత్వ సంపద అని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రత్యేక గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ఎంతో కీలకమని మంత్రి తెలిపారు. నేడు అనేక దేశాలు యోగాను తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం భారతదేశానికి గర్వకారణమన్నారు.

ప్రస్తుత జీవన విధానంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

అనంతరం జపాన్‌లో జరిగిన హాకీ ఆసియా కప్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించిన క్రీడాకారిణి నమ్మి గీతా శ్రీనును హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా గీతా శ్రీను సాధించిన విజయాన్ని అభినందించిన వారు, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, యోగా అభిమానులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…