విజయవాడ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్తుంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ సిటీ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వైసీపీ నేత బొప్పన వెళ్లారు. తాను వైసీపీని వీడి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు బొప్పన భవకుమార్ స్పష్టం చేశారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్న బొప్పన ఇప్పటికే కేశినేని చిన్ని, వంగవీటి రాధా, గద్దె రామ్మోహన్ తదితర నేతలతో చర్చలు జరిపారు.
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధితో పాటు తానూ ఈ నెల 21వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని తెలిపారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
పార్టీ కోసం పని చేసిన తనతో పాటు జలీల్ ఖాన్, పార్థసారధి, సామినేని ఉదయ భానులకు గౌరవం లేదని బొప్పన భవకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నేతలు ఒక్కొక్కరూ పార్టీ వీడుతున్నారని.. ఉదయ భాను ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ వైసీపీలో ఎవ్వరూ ఇమడలేని పరిస్థితి నెలకొందన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి