West Bengal: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ కొనసాగింపు.. స్టేకు నిరాకరించిన హైకోర్టు!
West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా రితబ్రత బెనర్జీ నియామకంపై కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై తాత్కాలికంగా స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
స్పీకర్ నిర్ణయంపై స్టేకు నిరాకరించిన కలకత్తా హైకోర్టు..
బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా రితబ్రత బెనర్జీ నియామకంపై కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై తాత్కాలికంగా స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
అసెంబ్లీ స్పీకర్ రథీంద్ర బోస్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే సోభందేబ్ చటోపాధ్యాయ్ హైకోర్టును ఆశ్రయించారు. తన నామినేషన్ తిరస్కరణతో పాటు రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా నియమించడాన్ని ఆయన ప్రశ్నించారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణరావు, స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు ప్రస్తుతానికి మార్గం సుగమమైంది.
అయితే ఈ వ్యవహారంలో సంబంధిత పక్షాలు మూడు వారాల్లోగా తమ వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్కు సమాధానం ఇవ్వడానికి మరో రెండు వారాల సమయం ఇచ్చింది.
ఈ కేసు తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు స్పీకర్ నిర్ణయంపై స్టే లేకపోవడంతో నియామకంపై న్యాయపరమైన ప్రక్రియ కొనసాగనుంది.
Be the first to react