Modi: స్లోవేకియాకు చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రవాస భారతీయుల ఘన స్వాగతం!
Modi: ప్రధాని నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బ్రాటిస్లావాకు చేరుకున్నారు. ఫ్రాన్స్లోని నీస్ పర్యటనను ముగించుకున్న అనంతరం రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఆయన స్లోవేకియాకు వెళ్లారు.
చరిత్రలో తొలిసారి భారత ప్రధాని స్లోవేకియా పర్యటన..
‘వందే మాతరం’తో మోదీకి స్వాగతం పలికిన స్లోవేకియా కళాకారులు..
బ్రాటిస్లావా: ప్రధాని నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బ్రాటిస్లావాకు చేరుకున్నారు. ఫ్రాన్స్లోని నీస్ పర్యటనను ముగించుకున్న అనంతరం రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఆయన స్లోవేకియాకు వెళ్లారు.
బ్రాటిస్లావా చేరుకున్న ప్రధాని మోదీకి స్లోవేకియా ప్రభుత్వం సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికింది. స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ విమానాశ్రయంలో ప్రధానిని ఆహ్వానించారు.
ప్రధాని మోదీ స్లోవేకియా రాక సందర్భంగా అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఉత్సాహంగా స్వాగతం పలికారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా స్లోవేకియాకు చెందిన ప్రముఖ లూచ్నికా ఎన్సెంబుల్ కళాకారులు ప్రధాని రాక సందర్భంగా ‘వందే మాతరం’ ప్రదర్శన చేశారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.
భారత ప్రధానిగా స్లోవేకియా రిపబ్లిక్ను సందర్శిస్తున్న తొలి ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఆర్థిక, వాణిజ్య సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ప్రధాని మోదీకి స్లోవేకియా ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించనుంది. ఈ పర్యటన భారత్–స్లోవేకియా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు.
Be the first to react