Supreme Court: మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!
Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
నామినేషన్ వివాదంలో మీనాక్షి నటరాజన్కు ఎదురుదెబ్బ..
రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై జోక్యం చేసుకోని సుప్రీంకోర్టు..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
తెలంగాణకు సంబంధించిన ఒక క్రిమినల్ కేసు వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదనే ఆరోపణల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చంద్రకర్లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి నామినేషన్ను తిరస్కరించిన తర్వాత, బాధిత అభ్యర్థికి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది.
నామినేషన్ తిరస్కరణ అంశంలో నేరుగా జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టపరంగా అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
అయితే మీనాక్షి నటరాజన్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేందుకు అవకాశం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాజ్యసభ నామినేషన్ వ్యవహారంలో ఆమెకు ప్రస్తుతానికి న్యాయపరమైన ఊరట లభించలేదు.
Tags
Be the first to react