LIVE
Chandrababu: సింగపూర్ పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు.. పెట్టుబడులే లక్ష్యంగా కీలక భేటీలు!  •  Mahanadu: బ్రిస్బేన్‌లో ఘనంగా టీడీపీ మహానాడు 2026.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస తెలుగు ప్రజలు!  •  London: భారతీయ యువకుడి హత్యతో లండన్ ఉలిక్కిపాటు.. ప్రవాస భారతీయులలో పెరుగుతున్న ఆందోళన!  •  Nara Lokesh: అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి... క్షేత్రస్థాయి వీడియోతో మంత్రి లోకేశ్‌ కౌంటర్!  • 
Andhra Pradesh

Prakasam Barrage: మున్నేరు వరద ప్రవాహం.. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల!

Prakasam Barrage: మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Kasthuri S 1 min read
Prakasam Barrage
Prakasam Barrage

ప్రకాశం బ్యారేజీకి చేరిన వరద నీరు.. 4 గేట్లు ఎత్తిన అధికారులు..

సముద్రంలోకి 2,900 క్యూసెక్కుల వరద నీరు విడుదల..

విజయవాడ: మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రకాశం బ్యారేజీకి చెందిన 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ నుంచి సుమారు 2,900 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే బందరు కాలువ, రైవస్ కాలువల ద్వారా మరో 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

కృష్ణా నదిలో వరద ప్రవాహం మరో 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ప్రజలు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని కోరారు. వరద పరిస్థితులపై సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

Be the first to react

More Coverage

AP News: చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించిన రాటకొండ మధుబాబు.. సీఎం గ్రీన్ సిగ్నల్! అన్నమయ్య జిల్లా టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్..

AP News: చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించిన రాటకొండ మధుబాబు.. సీఎం గ్రీన్ సిగ్నల్! అన్నమయ్య జిల్లా టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్..

AP News: నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా శాశ్వత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారిక కార్యాలయాన్ని మ…

Vijayawada: కేశినేని నాని ఆరోపణలకు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్.. రూ.120 కోట్ల బ్యాంక్ స్కామ్ ఆరోపణలు!

Vijayawada: కేశినేని నాని ఆరోపణలకు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్.. రూ.120 కోట్ల బ్యాంక్ స్కామ్ ఆరోపణలు!

Vijayawada: విజయవాడ రాజకీయాల్లో మరోసారి కేశినేని కుటుంబానికి సంబంధించిన వివాదం తెరపైకి వచ్చింది. తనప…

Pawan Kalyan: తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశం!

Pawan Kalyan: తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశం!

Pawan Kalyan: తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను అప్రమత్…