Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం..
తిరుమలలో భారీగా భక్తుల రాక.. నిన్న 86,124 మంది భక్తుల దర్శనం..
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోందని సమాచారం. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీ ఉన్నప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత రోజు మొత్తం 86,124 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కుల్లో భాగంగా 41,520 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.3.51 కోట్ల ఆదాయం లభించింది. భక్తుల కోసం విక్రయించిన లడ్డూల సంఖ్య 3.97 లక్షలకు చేరుకుంది.
అన్నప్రసాద సేవ ద్వారా 2.76 లక్షల మంది భక్తులు భోజన సదుపాయం పొందారు. అలాగే తిరుమలలో ఏర్పాటు చేసిన వైద్య సేవలను 3,972 మంది భక్తులు వినియోగించుకున్నారు. భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే సమయంలో టీటీడీ సూచనలు పాటిస్తూ, ఓపికతో సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
Be the first to react