ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇకపై ప్రతీ ఏటా ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని విద్యామంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనకు అనుగుణంగా త్వరలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించి తేదీలు కూడా ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు బదిలీలు ఎలా జరుగుతాయన్న దానిపైనా వివరాలు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి మే 7వ తేదీన ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మే 15 వరకూ అప్లికేషన్లు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అనంతరం మే 18 నుంచి 20వ తేదీ వరకూ ఎంఈవోల లాగిన్ లో సవరణలకు అవకాశం కల్పిస్తారు.
ఆ తర్వాత మే 21 నుంచి 22 వరకూ డీఈవోల లాగిన్ లో వీటి సవరణకు అవకాశం ఉంటుంది. అనంతరం మే 29న ఉపాధ్యాయుల వ్యక్తిగత మొబైల్స్ కు బదిలీల వివరాలు పంపిస్తారు. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు బదిలీ కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇప్ప టికే ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించబోతున్నారు. ఆదర్శ ప్రాధమిక పాఠశాల విధానంకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి అయిదో తరగతులకు అయిదు గురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తారు. ఇప్పటికే ఈ కేటాయింపులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. అదే విధంగా వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 30 నాటికి పూర్తి కానుంది.
ఇది కూడా చదవండి: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: