Green Tax: వారికి భారీ శుభవార్త! ఇకపై రూ.20వేలు కట్టక్కర్లేదు.. జస్ట్ రూ.3వేలు కడితే చాలు!

మనలో చాలామందికి బ్రెడ్‌ అన్నది ప్రతిరోజు అలవాటు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో టీతో, జామ్‌తో, ఆమ్లెట్‌తో లేదా సాండ్‌విచ్‌ రూపంలో వాడటం సాధారణమే. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం దీన్ని రోజూ తినడం శరీరానికి మెల్లగా హానికరమవుతుంది. వెల్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్ మిక్కీ మెహతా మాట్లాడుతూ, *“ప్రతి ఉదయం బ్రెడ్‌ తినక తప్పదా? అయితే కనీసం తగ్గించండి. ఎందుకంటే ఇది శరీరానికి ప్రమాదకరమైన ఆహారం కావచ్చు”* అని హెచ్చరించారు.

Vande Bharath: మొదటి వందే భారత్ స్లీపర్ ఎక్కడ నుండి? ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ప్రయాణం! ప్రారంభం ఎప్పుడు అంటే!

ఆయన ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలను ప్రస్తావించారు. బ్రెడ్‌ను ఎక్కువగా తింటే గట్ హెల్త్‌ దెబ్బతింటుందని, దానికి బదులుగా ఇసబ్‌గోల్‌ (psyllium husk) వాడితే మంచిదని చెప్పారు. రాత్రి పడుకునే ముందు, ఉదయం లేవగానే తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని సూచించారు. ప్రజల్లో బ్రెడ్‌పై ఉన్న అధిక ఆధారాన్ని కూడా ఆయన వీడియోలో వివరించారు.

Samsung Tri-fold Galaxy: శాంసంగ్ సంచలనం!లాంచ్ కు సిద్ధమవుతున్న ట్రై-ఫోల్డ్ గెలాక్సీ G ఫోల్డ్! ధర ఎంతంటే!

ఈ వీడియోపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వచ్చాయి. కొందరు ఆయన సలహాను సమర్థిస్తూ, ఆరోగ్యానికి రాగి, జొన్న రొట్టెలు వాడటం ఎంత ఉపయోగమో చెప్పారు. మరికొందరు మాత్రం దీన్ని తప్పుపట్టారు. “ప్రపంచంలో సగం మంది బ్రెడ్‌నే తింటారు, వాళ్లందరికీ సమస్యలేదే”, “బ్రిటిష్ ప్రజల లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 70 ఏళ్లు దాటుతుంది అంటూ వాదించారు. ఇంకొందరు వ్యంగ్యంగా – “అమెరికన్లు, యూరోపియన్లు ఉదయం ఇడ్లీ, వడ తింటారా?” అని కామెంట్ చేశారు.

Earthquakes: రాత్రికి రాత్రే మూడు భూకంపాలు! 2,200 మంది మృతి!

డాక్టర్ మెహతా ప్రస్తావించిన ఆటో-బ్రూవరీ సిండ్రోమ్‌ అనేది చాలా అరుదైన వ్యాధి. శరీరంలో ఉండే సూక్ష్మక్రిములు కార్బోహైడ్రేట్స్‌ను ఆల్కహాల్‌గా మారుస్తాయి. ఫలితంగా మద్యం తాగకపోయినా, మత్తు లక్షణాలు కనిపిస్తాయి. దీని కారణం Saccharomyces cerevisiae, Candida albicans వంటి ఫంగస్‌లు, మరికొన్ని బాక్టీరియాలు. ఇది అరుదైనా, వస్తే తీవ్రమైన సమస్యలు కలిగిస్తుంది.

Khairatabad Ganpati : దేశవ్యాప్తంగా ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ గణపతి.. నిమజ్జనానికి కౌంట్‌డౌన్!

ఈ వ్యాధి వచ్చే ప్రమాదం డయాబెటిస్‌, ఆల్కహాలిజం, యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడడం, కడుపు సంబంధ శస్త్రచికిత్సలు, లివర్‌ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువ. కానీ, ఆరోగ్య సమస్యలు లేని కొందరికి కూడా కనిపించింది. అందుకే నిపుణులు రోజూ బ్రెడ్‌ తినడాన్ని తగ్గించమని, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మద్యం తాగకపోయినా మత్తు లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

Nara Lokesh: సెంటర్‌ ఆఫ్‌ ద అట్రాక్షన్‌గా లోకేష్‌! అభినందించిన ఏపీ కేబినెట్.. ఎందుకంటే.?
Heavy Rains: రెడ్ అలర్ట్ జారీ.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన! ఈ ప్రాంతాల్లో సెప్టెంబర్ 7 వరకు.!
Students Scholarship: పేద విద్యార్థులకు శుభవార్త.. రూ.12,000 స్కాలర్‌షిప్ అవకాశం!
Nominated Posts: మహిళలకు నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట.. 18 ఏఎంసీలకు ఛైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం!
GST CUT: చిన్న పట్టణాల థియేటర్లకు సెంట్రల్‌ గిఫ్ట్..! సినిమా టికెట్లపై జీఎస్టీ భారీగా తగ్గింపు!