సినిమా ప్రేక్షకులకు, ముఖ్యంగా చిన్న పట్టణాలు మరియు గ్రామాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వినోద రంగంపై ఉన్న పన్ను భారాన్ని తగ్గిస్తూ, సినిమా టికెట్లు మరియు థియేటర్లలో అమ్మే పాప్కార్న్పై జీఎస్టీ రేట్లను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో చిన్న థియేటర్లు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది.
కొత్త నిబంధనల ప్రకారం రూ.100 లోపు ధర గల సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అయితే రూ.100 కంటే ఎక్కువ ధర ఉన్న టికెట్లపై ప్రస్తుత 18 శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది. దీని వల్ల మల్టీప్లెక్స్లు, ప్రీమియం థియేటర్లకు పెద్దగా లాభం లేకపోయినా, చిన్న పట్టణాలు, గ్రామాల్లోని థియేటర్లకు ఇది ఊరట కలిగించే నిర్ణయంగా మారింది.
టికెట్లతో పాటు పాప్కార్న్పై కూడా స్పష్టత ఇచ్చారు. ఇకపై ప్యాకేజింగ్తో సంబంధం లేకుండా సాల్టెడ్ పాప్కార్న్పై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే క్యారమెల్ పాప్కార్న్పై మాత్రం 18 శాతం జీఎస్టీ అమల్లో ఉంటుంది. ఈ మార్పులతో ప్రేక్షకులకు సినిమా అనుభవం మరింత అందుబాటులోకి వస్తుందని, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా తిరిగి చైతన్యం పొందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.