ఏపీలో గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓటమిపాలైన తర్వాత భవిష్యత్ రాజకీయంపై జగన్ పూర్తిస్దాయిలో మేథోమథనం చేయలేదు. అదే సమయంలో కూటమి సర్కార్ పాత కేసులతో వైసీపీ నేతల్ని తరుముతుతోంది. అటు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కు అండగా నిలవాలా లేక పోరాటం చేయాలా అన్న దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలకు భవిష్యత్ రాజకీయంపై దిశానిర్దేశం చేసేందుకు జగన్ సిద్దమవుతున్నారు. ఇందుకోసం రెండు కీలక భేటీలు నిర్వహించబోతున్నారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుపై కేశినేని నాని పోస్ట్! టీడీపీలో రీఎంట్రీ ప్రచారం వేళ..!
ఈ నెల 22, 23 తేదీల్లో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలతో జగన్ భేటీ కాబోతున్నారు. ఇందులో 22వ తేదీన వైసీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో జగన్ సమావేశం కాబోతున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్ చర్చించనున్నారు. అలాగే పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు.
మరోవైపు ఈ నెల 23న జిల్లా సోషల్ మీడియా, వైసీపీ అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశం అవుతారు. ఇందులో వైసీపీ సోషల్ మీడియా తిరిగి యాక్టివ్ కావడంపై దిశానిర్దేశం చేయబోతున్నారు. అసలే కూటమి సర్కార్ కేసులతో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా డల్ అయిపోయింది. దీంతో భవిష్యత్తులో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న దానిపై సోషల్ టీమ్స్ కు జగన్ దిశానిర్దేశం చేస్తారు. అలాగే జిల్లాల అధ్యక్షులు ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీల ఉల్లంఘనపై జనంలోకి వెళ్లి ఎలా వివరించాలో జగన్ సూచనలు చేయబోతున్నారు.
ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు! ఎస్సైకి సస్పెన్షన్ వేటు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: