ఏపీలో కొత్తగా ఆరు వరుసల నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. అమరావతి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయుడుపేట రేణిగుంట జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. ఆరు వరుసలుగా నాయుడుపేట రేణిగుంట జాతీయ రహదారిని నిర్మించారు. మొత్తం 57 కిలోమీటర్ల మేర నాయుడుపేట రేణిగుంట జాతీయ రహదారి నిర్మించారు. ఈ రహదారిపై ఇప్పటికే రాకపోకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రధాని మోదీ అధికారికంగా జాతికి అంకితం చేశారు.
ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన తర్వాత ఏపీలో మరిన్ని అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. వీటితో పాటు నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రానికి, విశాఖలో యూనిటీ మాల్కు, అలాగే రాష్ట్రంలో రూ.3,716 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆరు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అలాగే రూ.3680 కోట్లతో ఇప్పటికే నిర్మాణం పూర్తైన 8 జాతీయ రహదారులను ప్రారంభించారు. రూ.254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్లో నాలుగ లైన్లుగా!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన జాతీయ రహదారులతో నాయుడుపేట- రేణిగుంట ఆరు వరుసల జాతీయ రహదారి (71 NH)కూడా ఉంది. 2016లో భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం నాయుడుపేట రేణిగుంట ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాయుడుపేట నుంచి రేణిగుంట వరకూ 57 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారిగా విస్తరించాలని నిర్ణయించారు. రూ.2,510 కోట్లతో 2020లో పనులను కాంట్రాక్టర్కు అప్పగించారు. 2025 జనవరి ఆఖరి నాటికి పనులు పూర్తయ్యాయి. వాహనాల రాకపోకలను కూడా లాంఛనంగా ప్రారంభించారు.
నాయుడుపేట- రేణిగుంట ఆరు వరుసల జాతీయ రహదారి.. కోల్కతా-చెన్నై జాతీయ రహదారిలోని నాయుడుపేట వద్ద మొదలవుతుంది. శ్రీకాళహస్తి మీదుగా కడప-చెన్నై రహదారి సమీపంలోని రేణిగుంట వద్ద ముగుస్తుంది. ఈ రహదారిని వలయాకారంగా నిర్మించారు. అలాగే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కార్లు, 80 కిలోమీటర్ల వేగంతో బస్సులు, లారీలు దూసుకెళ్లేలా నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిని నిర్మించారు. నాయుడుపేట రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా శ్రీకాళహస్తి సమీపంలో స్వర్ణముఖినదిపై కొత్త వంతెన, మార్గమధ్యలో మరో ఏడు బ్రిడ్జిలు, పది ఆర్వోబీలు నిర్మించారు. ఈ జాతీయ రహదారిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్తో - ఇక వారికి పండగే..
నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!
ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!
కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..
షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?
గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?
గన్నవరం ఎయిర్పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!
ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!
అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్లైన్స్ విడుదల!
రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!
మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: