LIVE
Nara Lokesh: కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం!  •  Weight Loss: చుక్క నూనె లేకుండా నోరూరించే చికెన్ కర్రీ.. బరువు తగ్గడానికి బెస్ట్ డైట్!  •  Land Regestraions: బిగ్ అలర్ట్.. ఆ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్!  •  Talliki Vandanam: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు... లోకేష్ కీలక ఆదేశాలు!  •  AP Development: మైసూర్ జేఎస్‌ఎస్ సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ ప్రాంతానికి మహర్దశ... భూసేకరణ షురూ!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్ విత్‌డ్రా!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!  •  APSDMA: ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసిన APSDMA!  •  Movie Review: ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ... అమ్మ జీవితానికి రెండో అవకాశం.. హృదయాలను కదిలిస్తున్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం!  •  TTD Updates: భక్తులకు గుడ్ న్యూస్... రూ. 10,500 అవసరం లేదు.. కేవలం రూ. 120 కే శ్రీవారి దర్శనం!  • 
Politics

AP Govt: మాజీ మంత్రి కొడాలి నాని కేసులో ముందడుగు.. విచారణకు అనుమతించిన ప్రభుత్వం!

AP Govt: మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రాసిక్యూషన్ కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Kasthuri S 1 min read
Kodali Nani
Kodali Nani

కొడాలి నాని వ్యాఖ్యల కేసులో పెండింగ్‌కు తెర.. విచారణకు మార్గం సుగమం..

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు.. కొడాలి నానిపై కేసు దర్యాప్తుకు అనుమతి..

అమరావతి: మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రాసిక్యూషన్ కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కృష్ణా జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొడాలి నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి నివేదిక పంపింది.

ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు అనుమతితో గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రజాప్రతినిధులపై కేసుల్లో విచారణ కొనసాగించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది.

తాజాగా ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి విచారణకు అనుమతి మంజూరు చేసింది. దీంతో కేసు తదుపరి దశకు వెళ్లనుంది.

Be the first to react

More Coverage

Nara Lokesh: రాయలసీమ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. జేఎస్ఎస్ ఒప్పందంతో తిరుపతి ప్రాధాన్యత మరింత పెంపు! 70 ఏళ్ల సుదీర్ఘ విద్యా చరిత్ర..

Nara Lokesh: రాయలసీమ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. జేఎస్ఎస్ ఒప్పందంతో తిరుపతి ప్రాధాన్యత మరింత పెంపు! 70 ఏళ్ల సుదీర్ఘ విద్యా చరిత్ర..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన ప్రజాప్రభుత్వంలో విద్యా రంగం అభివృద్ధికి కీలక అడుగు…

Nara Lokesh: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్.. ప్రైవేట్ అభ్యర్థుల విభాగంలోనూ పెరిగిన ఉత్తీర్ణత!

Nara Lokesh: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్.. ప్రైవేట్ అభ్యర్థుల విభాగంలోనూ పెరిగిన ఉత్తీర్ణత!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ (ఐపీఏఎస్‌ఈ)-2…