ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఏపీకి చెందిన 'యోగాంధ్ర-2025' కార్యక్రమాన్ని ప్రస్తావించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'యోగాంధ్ర-2025' లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఐక్యంగా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ యోగా శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. వంద పర్యాటక ప్రదేశాలతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు చేశారు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, విశాఖలో ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..
ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!
కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..
రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!
విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!
హార్వర్డ్కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!
గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?
వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!
వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!
స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!
జగన్ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!
విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్..! పీఎన్బీఎస్పై తగ్గనున్న ఒత్తిడి!
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?
ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: