Header Banner

విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

  Sat May 24, 2025 07:05        India

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో మరో మూడు నెలల్లోనే నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయాలని ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. అంతేకాకుండా 2028 నాటికి విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్ పట్టణానికి విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎమిరేట్స్ విమానాలను కూడా ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 

 

ఇది కూడా చదవండి: జూన్ 1 తర్వాత థియేటర్లు క్లోజ్ అవుతాయా? రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కమిటీ గురువారం రోజు సమావేశం నిర్వహించింది. ఇందులో ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఇంఛార్జీ కలెక్టర్ గీతాంజలి శర్మ, డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి, జీఎం రామాచారి, ఎస్పీ గాంగాధర రావు, అధికారులతో కలిసి పాల్గొని.. విమానాశ్రయ అభివృద్ధితో పాటు ప్రయాణికుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ప్రతి రాష్ట్రానికి అనుసంధానం అయ్యేలా విమాన సర్వీసులు నడిపేందుకు వివిధ విమానయాన సంస్థలతో సంప్రదించినట్లు చెప్పారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు!

 

ఇవి మాత్రమే కాకుండా విజయవాడ నుంచి శ్రీలంక, సింగపూర్, థాయ్ లాండ్, దుబాయ్ లకు ఎమిరేట్స్ విమానాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు 70 శాతం పూర్తి అయ్యాయని మంత్రి బాలశౌరి వివరించారు. అలాగే ప్రతి నెలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా టెర్మినల్స్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అందులో ప్రాచీన సంస్కృతి, కూచిపూడి భంగిమలు ఉంటాయన్నారు.

 

ఇది కూడా చదవండి: ఫాస్టాగ్ లో కీలక మార్పు! ఇకపై అన్ లిమిటెడ్ హైవే జర్నీ!

 

సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్ ల ఆదేశాలతోనే.. 12 డిజెన్లను మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేశినేని చిన్నా చెప్పారు. వారణాసి, కొచ్చి, అహ్మదాబాద్ లకు కొత్త సర్వీసులు నడిపేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు వివరించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక వేగవంతం అయ్యాయని అన్నారు.

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హరిహర వీరమల్లుకు ముప్పు! జూన్ 1 నుంచి థియేటర్లు బంద్! ఇదే కారణమా?

 

పీఎస్సార్ కస్టడీలో బిగ్ ట్విస్ట్ - హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు! ఈ ఫామ్ హౌస్ లోనే..

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

  

జగన్ కు సాయిరెడ్డి మాస్ కౌంటర్! ఏమన్నారంటే..?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు! 

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే! 

 

ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన.. 

 
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!
 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #AndhraPravasi #VijayawadaAirport #InternationalAirport #IntegratedTerminal #NewYorkFlights #EmiratesFlights #AirportDevelopment #AndhraPradesh