రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. రాయితీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు అందిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది.. అయితే భూమి ఉన్న రైతులతో పాటుగా భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసే కౌలు రైతులకు గూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని, బ్యాంకు రుణాలను అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. ఇందుకోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
దేశానికి వెన్నెముక అన్నదాతలు. అలాంటి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడమే కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు, పెట్టుబడి సాయం అందిస్తూ రైతన్నను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే భూమి ఉన్న రైతులకు ఈ ప్రయోజనాలు అందుతున్నాయి కానీ.. కౌలు రైతుల కష్టాలు తీరడం లేదు. కౌలు రైతులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి అందడం లేదు. ఈ క్రమంలోనే కౌలు రైతులకు కూడా లబ్ధి కలిగించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ సాయం అందించే ఆలోచన చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు అందిస్తోంది.
కౌలు రైతులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లోని వాస్తవ సాగుదారులను గుర్తించి, వారికి గుర్తింపు కార్డులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేసి.. అండగా నిలవాలనే ఉద్దేశంతో చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కౌలు రైతులు గ్రామాల్లోని వ్యవసాయ, రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని.. ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కౌలు కార్డుల ద్వారా అనేక ప్రయోజనాలు అందుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కౌలు గుర్తింపు కార్డులు ఉన్న రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులతో పాటుగా యంత్రపరికరాలు కూడా అందించనున్నట్లు చెప్తున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!
అలాగే కౌలు కార్డులు ఉన్న రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు లభిస్తాయి. భారీ వర్షాలతో పాటుగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా పంట నష్టం సంభవించినప్పుడు రైతులకు పరిహారం అందుతుంది. అలాగే పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మాలంటే కౌలు కార్డులు తప్పనిసరి. ఇక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీలో రాయితీ కూడా అందుతుందని అధికారులు వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కౌలు రైతులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే గ్రామాల్లో భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలు రైతులను వ్యవసాయశాఖ సిబ్బంది గుర్తించి.. అలాంటి వారి వివరాలు వీఆర్వోలకు అందజేస్తారు. లేదా గ్రామసభలు ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించనున్నారు. ఇక వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి కౌలుదారు, యజమాని, భూమి వంటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ పరిశీలన అనంతరం అర్హత కలిగిన ప్రతి కౌలు రైతుకు.. గుర్తింపుకార్డును ప్రభుత్వం జారీ చేయనుంది.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ డ్రైవర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..! అర్హతలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దిగి వచ్చిన మెట్రో.. టికెట్ ధరలు తగ్గింపు.. ఎంతంటే!
ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్..! ప్రమోషన్తో పాటుగా నెలకు జీతం పెంపు..!
వల్లభనేని వంశీ కేసులో కీలక మలుపు..! పీటీ వారెంట్ అమలుపై హైకోర్టు బ్రేక్!
మహానాడు కోసం భారీ ఏర్పాట్లు! కీలక నేతల ఆధ్వర్యంలో 19 కమిటీలు!
చంద్రబాబు కీలక ప్రకటన.. అధికారుల గుండెల్లో గుబులు! జూన్ 12 తర్వాత ఎప్పుడైనా..
తల్లికి వందనం పై లేటెస్ట్ అప్డేట్! కొత్త నిబంధనలతో... అర్హులు వీరే!
మోడల్ స్కూల్స్లో కాంట్రాక్టు టీచర్లకు ఊరట..! కీలక ఉత్తర్వులు జారీ..!
విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్..! కేవలం 9 గంటల్లో..!
ఈ-పాస్పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
వైసీపీకి మరోసారి దెబ్బ మీద దెబ్బ! ఒకే రోజు రెండు వరుస షాకులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: