AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ ఉద్యోగులందరి నోటీసులు.. తొలగింపు!

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఈ రైతులు, ఇప్పుడు మళ్లీ ఆశల వెలుగులోకి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంపై స్పష్టతనిచ్చిన నేపథ్యంలో, రైతులకు భరోసా కలిగిస్తోంది. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి సహకారం రావడం కూడా పెద్ద ఊరటగా మారింది.

Free Education: ఏపీలో విద్యార్థులకు ఉచిత విద్య.. మొత్తం ఖర్చు ప్రభుత్వానిదే! అర్హులు వీరే!

అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు హయాంలో returnable plots కేటాయించారు. అయితే, గత ప్రభుత్వం రాజధాని మార్పుపై తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ప్లాట్లపై loans ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. కానీ ఇప్పుడు యూనియన్ బ్యాంక్‌ లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తూ ఇతర బ్యాంకులకు రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు మంజూరు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

US Visa: వీసాలపై అమెరికా మరో బాంబ్! ఇక నుండి అంత మొత్తం చెల్లించాల్సిందే...!

ఈ మార్పుతో రైతులు మళ్లీ తమ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకునే అవకాశాలు మెరుగయ్యాయి. ఇటీవల సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో రైతులు ఈ అంశాన్ని ప్రస్తావించగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకులు స్పందించాయి. ఫలితంగా రుణాల కోసం రైతులు మళ్లీ బ్యాంకులకెదురుచూస్తున్నారు. ఇది అమరావతి అభివృద్ధికి తోడ్పడే ప్రోత్సాహకరమైన పరిణామంగా చెప్పవచ్చు.

Job Notification: RRB ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా... మూడు రోజులే గడువు!
Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం! 160 మందికి పైగా ప్రయాణికులు 3 గంటలుగా...
Praja Vedika: నేడు (5/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Caravan buses: క్యారవాన్ బస్సులు రెడీ... త్వరలో అరకు కు!
Rains Alert: రేపు పిడుగులతో కూడిన వర్షాలు... APSDMA!
Dengue: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు..! ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!
Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు...! హడలిపోయిన ప్రజలు!