Rains Alert: రేపు పిడుగులతో కూడిన వర్షాలు... APSDMA!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త దిశలో అడుగులు వేస్తోంది. పర్యాటకాలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా 'క్యారవాన్ టూరిజం' ను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ టూరిజం విధానం ద్వారా ప్రకృతి అందాలు, అడవులు, కొండలు, లోయలు ఉన్న ప్రాంతాల్లో బస్సుల ద్వారా ప్రయాణిస్తూ అక్కడే క్యాంప్ చేసే అవకాశం కలిగించనున్నారు.

Dengue: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు..! ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!

ప్రస్తుతం రెండు క్యారవాన్ బస్సులు (Caravan buses ) సిద్ధమయ్యాయి. వీటిని ప్రారంభ దశలో అరకు లోయ పరిసర ప్రాంతాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రాంతాల్లోని ఐదు ప్రత్యేక ప్రదేశాలను అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు. టూరిస్టులు అక్కడే కొన్ని రోజులు గడిపేలా క్యాంప్‌ఫైర్, ఆట స్థలాలు, విశ్రాంతి గదులు వంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు...! హడలిపోయిన ప్రజలు!

ఈ టూరిజం విధానంతో అరకు ప్రాంతానికి పర్యాటకుల రాక పెరుగుతుందని, దాని ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్యారవాన్ బస్సులు పూర్తి సౌకర్యాలతో కూడిన మొబైల్ హోటళ్లలా ఉంటాయి. దీని ద్వారా కుటుంబాలు, స్నేహితుల సమూహాలు ప్రకృతిని ఆస్వాదించుతూ సురక్షితంగా ప్రయాణించవచ్చు.

CBN: సెప్టెంబర్ నుంచి నూతన బార్ పాలసీ... సీఎం CBN!

ప్రస్తుతం నూతన పర్యాటక విధానానికి సంబంధించిన ప్రతిపాదనలు సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. ఆమోదం ఇచ్చిన వెంటనే క్యారవాన్ బస్సులు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం పర్యాటక రంగాన్ని నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు.

Pawan Kalyan: వారికి సెల్యూట్ పవన్ కళ్యాణ్... మానవతా విలువలకు నిలువెత్తు!
Nara Lokesh: ఆదోని హైస్కూల్లో 'నో అడ్మిషన్' బోర్డు చూసి చాలా ఆనందించాను! మంత్రి నారా లోకేశ్!
Red Color Spinach: పాలకూరతో ఎన్నో లాభాలు! తరచూ తినాల్సిందే!
Post Service: రాఖీ పండుగ వేళ..! తపాలా శాఖ సూపర్ న్యూస్.!
Network problem: హలో.. హలో.. మీకూ ఇదే సమస్యా... ఇబ్బందులతో యూజర్లు!
Droupadi Murmu: రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు..! జమ్ము కశ్మీర్ కోసమా?