Pawan Kalyan Speech: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. 30 ఏళ్ల పాలనపై ప్రత్యేక సందేశం! ముఖ్యమంత్రిగా కేంద్రంతో..

తిరుపతి భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. నడికుడి-శ్రీకాళహస్తి మార్గం ద్వారా కొత్త రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మార్గంలో న్యూ పిడుగురాళ్ల నుండి శావల్యాపురం వరకు 46 కి.మీ. దూరం కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మించబడింది. ఈ మార్గం సాయంతో సికింద్రాబాద్ నుండి తిరుపతి మీదుగా దక్షిణాది నగరాలకు నేరుగా అనుసంధానం కలుగుతుంది.

Nominated List: ఏపీలో మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం! నామినేటెడ్ లిస్ట్ పూర్తి వివరాలు ఇవిగోండి..

ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 25 వరకు చెర్లపల్లి నుండి నంద్యాల మీదుగా తిరుపతికి కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించారు. రైలు నెంబర్ 07013 మంగళవారం రాత్రి 9.10 గంటలకు చెర్లపల్లిలో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు నల్గొండ, పిడుగురాళ్ల, మార్కాపురం, గిద్దలూరు వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతూ నంద్యాలకు చేరుకుంటుంది. అక్కడి నుండి ఉదయం 5.35 గంటలకు బయలుదేరి కోయిలకుంట్ల మీదుగా తిరుపతికి చేరుతుంది.

Eating chicken: చికెన్ తిని వెంటనే పడుకుంటున్నారా.. వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు!

తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 07014 బుధవారం సాయంత్రం 4.40 గంటలకు తిరుపతి నుండి బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10.25 గంటలకు నంద్యాలకు చేరుకుని, గురువారం ఉదయం 8 గంటలకు చెర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు ద్వారా ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలోని ప్రజలకు సౌకర్యం కలుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Liquor: ఏపీలో కొత్త బార్ పాలసీ అమల్లోకి..! ఇకపై అదనంగా ఒక గంట సడలింపు!

ప్రస్తుతం ఈ రైలు వారానికి ఒకసారి మాత్రమే నడపబడుతుంది. అయితే మొదటగా మూడు నెలలపాటు మాత్రమే ఈ సర్వీస్ కొనసాగనుంది. ప్రయాణీకుల రద్దీ మరియు ఆక్యుపెన్సీని బట్టి, దీనిని మరింత కాలం కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంచి స్పందన వస్తే ఈ రైలును రెగ్యులర్ సర్వీస్‌గా మార్చే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నది.

Modi putin: పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే.. PM మోదీ!

ఇకపోతే, ఈ మార్గంలో తిరుపతికి వందేభారత్ రైలును కూడా నడపాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీనిపై రైల్వే శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.

GST: జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..! ఆగస్టులోనే రూ.1.86 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు..!

ఈ విధంగా కొత్త రైలు ప్రారంభం కావడంతో తిరుపతి భక్తులు, ముఖ్యంగా రాయలసీమ వాసులు, మరింత సులభంగా, వేగంగా, ఆర్థికంగా ప్రయాణించగలరని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RAILWAY: రైలు ప్రయాణికులకు శుభవార్త..! విశాలమైన సీట్లు, అధిక భద్రతతో కొత్త బోగీలు..!
Chandrababu Comments: వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే అసెంబ్లీకి రండి - తేల్చుకుందాం! రాజంపేట పర్యటనలో..
EC: ఈసీపై పార్టీల విభేదాలు! సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు!
IBM Quantum: రూ. 6 కోట్లతో మరో క్వాంటం కంప్యూటర్ గ్రీన్‌సిగ్నల్‌.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో సంచలన ఆఫర్.. ఒకటి కాదు రెండు.. సామ్‌సంగ్ డబుల్ ధమాకా.!