LIVE
Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  •  Retirement Age: పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు.. హైకోర్టు కీలక తీర్పు!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

TDP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ సైకిల్ యాత్రకు శ్రీకారం!

TDP: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.

AndhraPravasi News Desk 2 min read
TDP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ సైకిల్ యాత్రకు శ్రీకారం!

పర్యావరణ పరిరక్షణకు సైకిల్ వినియోగమే మార్గం: పల్లా శ్రీనివాసరావు..

‘నా దేశం – నా బాధ్యత’.. ఇంధన వినియోగం తగ్గించాలని పిలుపు..

మంగళగిరి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చేరవేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు సైకిళ్లను వినియోగించాలని పిలుపునిచ్చారు. సైకిల్ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో హెలిప్యాడ్ నుంచి విడిది కేంద్రం వరకు సైకిల్‌పై ప్రయాణించనున్నట్లు పల్లా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమ రోజువారీ కార్యక్రమాలకు సైకిళ్లను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటాలని కోరారు.

ప్రస్తుతం ప్రపంచం వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. పర్యావరణాన్ని కాపాడడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అవగాహనను పెంచేందుకే సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సైకిల్ వినియోగం వల్ల వాహనాల నుంచి వెలువడే కాలుష్యం తగ్గుతుందని, ఇంధన వినియోగం తగ్గడంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. ప్రకృతికి మేలు చేసే చిన్న చిన్న చర్యలే భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారి తీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “నా దేశం – నా బాధ్యత” అనే పిలుపును గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. దీనివల్ల ఇంధన పొదుపుతో పాటు వాతావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని చెప్పారు.

వాహనాల నుంచి వెలువడే విషపూరిత వాయువుల కారణంగా కర్బన్ కాలుష్యం పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతోనే ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించామని తెలిపారు. సుమారు 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు డిజిటల్ వేదిక ద్వారా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పారు.

రేపు నిర్వహించే సైకిల్ యాత్రలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. “పర్యావరణ పరిరక్షణకు నేను సైతం” అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…