⚡ BREAKING
Home Loan Benefits: గోల్డెన్ ఛాన్స్.. ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రాల్లో మహిళల పేరుతో కొంటే స్టాంప్ ఫీజులో..  •  రికార్డ్ స్థాయిలో ఏపీ కూటమి ప్రభుత్వ సంస్థ APNRT కోఆర్డినేటర్ల నియామకం! తెలుగు ఎన్నారైల సంక్షేమం కోసం 600 కు పైగా....  •  ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం... గల్ఫ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా APNRT నూతన కమిటీల ప్రకటన! లిస్ట్....  •  ఎన్‌ఆర్ఐ తెలుగు కమ్యూనిటీ కోసం సమగ్ర కోఆర్డినేటర్ల నియామకం... US లిస్ట్ ఇదే!  •  Government Jobs: నిరుద్యోగులకు బంపర్ గిఫ్ట్.. మూడు వర్సిటీల్లో 984 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! నో ఇంటర్వ్యూ, నో ఎక్సమ్  • 

Delhi: ఢిల్లీలో వాయు కాలుష్యానికి చెక్.. పర్మనెంట్ వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Delhi: శీతాకాలంలో తీవ్రంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం శాశ్వత 'వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్'ను ప్రకటించింది. ప్రతి ఏడాది నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.

Delhi Pollution
Delhi Pollution

PUC లేకుంటే ఇంధనం లేదు.. ఢిల్లీలో కొత్త కాలుష్య నియంత్రణ నిబంధనలు..

వాయు కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ కఠిన చర్యలు.. ప్రతి ఏడాది నవంబర్ నుంచి ప్రత్యేక ఆంక్షలు..

న్యూఢిల్లీ: శీతాకాలంలో తీవ్రంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం శాశ్వత 'వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్'ను ప్రకటించింది. ప్రతి ఏడాది నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.

ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ.. ప్రతి శీతాకాలంలో కొత్తగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేకుండా, ఇప్పటికే అమలులో ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే విధానంలో సమగ్రంగా పొందుపరిచామని చెప్పారు. ఈ మాస్టర్ ప్లాన్లో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) సవరించిన GRAP మార్గదర్శకాలు, అలాగే సుప్రీంకోర్టు సూచనలు కూడా చేర్చినట్లు తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం (PUC) లేని వాహనాలకు ఏడాది పొడవునా ఢిల్లీలోని పెట్రోల్ బంకులు, సీఎన్జీ, ఎల్పీజీ కేంద్రాల్లో ఇంధనం ఇవ్వరు.

అలాగే ప్రతి ఏడాది నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్ ఉన్న BS-VI ప్రమాణాలకు లోబడని వాహనాల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. అయితే సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, ఇతర అత్యవసర సేవల వాహనాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అధికారిక పార్కింగ్ స్థలాల్లో పార్కింగ్ చార్జీలను రెట్టింపు చేయనున్నారు. అలాగే నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే (వర్క్ ఫ్రం హోమ్) విధానాన్ని అమలు చేస్తారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కార్యాలయాల పని వేళలను కూడా దశలవారీగా మార్చనున్నారు.

ఇక నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు అత్యవసర ప్రజా మౌలిక సదుపాయాల పనులు మినహా, కూల్చివేతలు మరియు అధిక ధూళి వ్యాపించే నిర్మాణ పనులపై నిషేధం విధించారు. పెద్ద వాణిజ్య భవనాలు, భారీ నిర్మాణ ప్రదేశాల్లో యాంటీ-స్మాగ్ గన్స్ లేదా మిస్ట్ సిస్టమ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

బహిరంగ ప్రదేశాల్లో చెత్త దహనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయంలో సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఢిల్లీని పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన నగరంగా మార్చాలంటే ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి సహకారం అవసరమని అన్నారు. శాశ్వత మాస్టర్ ప్లాన్ ద్వారా కాలుష్య నియంత్రణ చర్యలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని, శీతాకాల వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందుగానే సిద్ధంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

Tags

Be the first to react

Latest