మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం అలంకరించుకోవడంతో ఉద్విగ్నం, ఆరోపణలు, ఉద్వేగాలతో నిండిన ఈ సీజన్కు ఒక గట్టిగా ముగింపు లభించింది. థాయ్లాండ్లో జరిగిన తుది కార్యక్రమంలో ఆమెను ప్రపంచ సౌందర్య రాణిగా ప్రకటించగానే అక్కడి ప్రేక్షకులు హర్షధ్వానాలతో స్వాగతించారు. వయసు 25 మాత్రమే అయినా ఈ పోటీ మొత్తం ఆమె చుట్టూ నెలకొన్న వివాదాలు మాత్రం అంత తేలిక కావు.
నవంబర్ ప్రారంభంలో ఒక ప్రమోషనల్ ఈవెంట్లో నిర్వాహకుడు ఆమెను ఇతర పోటీదారుల ముందే తీవ్రంగా విమర్శన ఘటనకు ఆమె అక్కడి నుంచే వెళ్లిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఆమెకు మద్దతుగా మరికొందరు పోటీదారులు కూడా హాల్ను విడిచిపెట్టారు.
ఈ ఘటనపై మిస్ యూనివర్స్ సంస్థ నేరుగా స్పందిస్తూ, థాయ్ నిర్వాహకుడు నవాట్ ఇట్స్రాగ్రసిల్ ప్రవర్తనను “దురుద్దేశపూరితమైనది” అని వ్యాఖ్యానించింది. అనంతరం ఆయన క్షమాపణ చెప్పినా, అప్పటికే అంతర్జాతీయ నిర్వాహకులు పోటీ నిర్వహణలో జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఇద్దరు న్యాయనిర్ణేతలు రాజీనామా చేశారు. వారిలో ఒకరు ముందుగానే తుది జాబితా సిద్ధమైందని, పోటీ న్యాయంగా జరగలేదని ఆరోపించడం మరో వివాదానికి తెరలేపింది.
అయితే మిస్ యూనివర్స్ సంస్థ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, నిర్ణయ ప్రక్రియలో ఎవరూ జోక్యం చేసుకోవడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
ఈ అంతర్గత ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న పోటీలో థాయ్లాండ్కు చెందిన ప్రవీనార్ సింగ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. వెనిజులా, ఫిలిప్పిన్స్, ఐవరీ కోస్ట్ యువతులు టాప్–5లో చోటు సంపాదించారు. దశాబ్దాలుగా లాటిన్ అమెరికా దేశాలు ఆధిపత్యం చెలాయించిన ఈ రంగంలో ఇప్పుడు దక్షిణాసియా భారీ అభిమాన వర్గం ఆధిపత్యం పెరుగుతోంది.
థాయ్లాండ్, ఫిలిప్పిన్స్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఈ పోటీలు పలువురికి సినీ టీవీ వడ్డి వంటి రంగాలలో కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ ఏడాది పోటీపై మరింత ప్రభావం చూపిన అంశం నాయకత్వ మార్పు. సంస్థను కొనుగోలు చేసి పోటీల్లో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చిన థాయ్ వ్యాపారవేత్త ఆన్ జక్రజుటతిప్ ఇటీవల పదవి నుంచి వైదొలగడంతో, ఆమె స్థానంలో గ్వాటెమాలా రాయబారి మారియో బుకారో బాధ్యతలు చేపట్టారు.
వివాహితలు, పిల్లలు ఉన్న మహిళలు, ట్రాన్స్జెండర్ పోటీదారులకు అవకాశం కల్పిస్తూ ఆమె చేసిన సంస్కరణలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఆమె సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడటం తదనంతరం తాత్కాలిక నిర్వహణలో చోటు చేసుకున్న భిన్నాభిప్రాయాలు ఈ ఏడాది పోటీని మరింత గందరగోళానికి గురి చేశాయి.
ఇప్పుడంతా మారిపోయిన యుగంలో మిస్ యూనివర్స్ వంటి పోటీలు టెలివిజన్తో పాటు సోషల్ మీడియా ప్రపంచానికి తగిన విధంగా మారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో కోట్లాది మంది అనుచరులు కలిగిన మాజీ టైటిల్ హోల్డర్లు, రన్నర్-అప్స్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, కేవలం ఒక రాత్రి జరిగే ఈవెంట్కే పరిమితం కావడం సాధ్యంకాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆన్లైన్ షోస్, రియాలిటీ ఫార్మాట్స్, లైవ్ స్ట్రీమింగ్ ప్రమోషన్లను బలోపేతం చేయాల్సిన ఒత్తిడి సంస్థపై పెరుగుతోంది.
శరీర సౌందర్యాన్ని ప్రధాన ప్రమాణంగా మలిచే ఈ కార్యక్రమం మహిళలను వస్తువుల్లా చూస్తుందనే విమర్శలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని పరంపరాగత దేశాల పోటీదారులకు స్విమ్సూట్ రౌండ్లో పూర్తి దుస్తులు ధరించే అనుమతి ఇవ్వడం వంటి మార్పులు సంస్థ కొత్త దిశలో అడుగులు వేస్తోందనే సంకేతాలు ఇస్తున్నాయి.
అన్ని వివాదాలు విమర్శల మధ్యఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది పోటీదారులకు నిజమైన శక్తిని ఇవ్వడం, వారి సామాజిక కార్యక్రమాలకు వేదిక కల్పించడం అనే ప్రధాన లక్ష్యం నిలబెట్టుకున్నప్పుడే మిస్ యూనివర్స్ బ్రాండ్కు విలువ ఉంటుందని మాజీ అధ్యక్షురాలు పౌలా షుగార్ట్ గుర్తుచేశారు. మహిళలను ప్రేరేపించనంత వరకు మిస్ యూనివర్స్కు అర్థం లేదు ఆమె చెప్పిన ఈ వ్యాఖ్య ఈ ఏడాది జరిగిన అల్లకల్లోలానికి సరైన ముగింపు లాగానే వినిపిస్తోంది.