Russia: రష్యాలో మూడోసారి 7.8 తీవ్రతతో భారీ భూకంపం..! సునామీ హెచ్చరికలు జారీ!

ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నీలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వరుసగా వివాదాలకు కారణమవుతోంది. టోర్నీ ప్రారంభం నుంచి ఐసీసీ నిబంధనలను విస్మరించడం, అధికారుల సూచనలను లెక్కచేయకపోవడం వల్ల పీసీబీపై ఐసీసీ దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌తో జరిగిన అధికారిక సమావేశాన్ని అనుమతి లేకుండా చిత్రీకరించి, తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయడం వివాదానికి నాంది పలికింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ‘ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA)’లో ఎటువంటి అనధికారిక వీడియోలు లేదా చిత్రాలు తీసుకోవడం నిషేధం. అయినప్పటికీ, పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సమస్యగా మారింది. ఈ చర్యపై ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా ఇప్పటికే పీసీబీకి హెచ్చరిక ఈమెయిల్ పంపినట్లు సమాచారం.

Heritage Foods: చంద్రబాబు సతీమణికి ఒక్కరోజే రూ.100 కోట్ల లాభం! మార్కెట్ లో హాట్ టాపిక్!

పీసీబీ వివాదాన్ని మరింత ముదిర్చేలా ప్రవర్తించడం గమనార్హం. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తమకు క్షమాపణలు చెప్పారని పీసీబీ ప్రచారం చేయగా, దీనిని ఐసీసీ ఖండించింది. పైక్రాఫ్ట్ కేవలం “తప్పుబాటు జరిగినందుకు విచారం వ్యక్తం చేశారు” కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, రిఫరీ గదిలోకి మీడియా మేనేజర్ నయీమ్ గిలానీని అనుమతించవద్దని రిఫరీ సూచించినప్పటికీ, పీసీబీ పట్టించుకోకుండా అతడిని తీసుకెళ్లింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయగా, ఒకవేళ గిలానీకి అనుమతి ఇవ్వకపోతే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విధమైన ప్రవర్తన ఐసీసీతో పాటు క్రికెట్ వర్గాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

Lokesh Mega Job Mela: లోకేష్ మెగా జాబ్ మేళా! ప్లేస్.. టైం.. దరఖాస్తు పూర్తి వివరాలు!

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత పీసీబీ ప్రవర్తనలో అసహనం మరింత స్పష్టమైంది. భారత ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు, తర్వాత కరచాలనం చేయలేదని ఆరోపిస్తూ, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పీసీబీ తరచూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తొలగించాలని కూడా పీసీబీ ఒత్తిడి తెచ్చింది. కానీ ఐసీసీ మాత్రం ఈ అభ్యర్థనలను తిరస్కరించింది. దీంతో అసంతృప్తి చెందిన పీసీబీ, యూఏఈతో మ్యాచ్‌కు ముందు వివాదాస్పద చర్యలకు పాల్పడింది. జట్టు హోటల్ నుంచి కావాలని ఆలస్యంగా బయలుదేరడంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ పరిణామం పీసీబీపై మరింత విమర్శలకు దారితీసింది.

kuwait weather news: కువైట్‌లో నివసించేవారికి చల్లటి కబురు చెప్పిన ప్రభుత్వం! ఈనెల ఆఖరి నుండి ఉపశమనం పొందవచ్చు!

ఇప్పటికే ఐసీసీ అంతర్గతంగా పీసీబీపై కఠిన చర్యలపై చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. నిరంతరం నిబంధనలను ఉల్లంఘించడం, అధికారులను అవమానించడం, వివాదాలను సృష్టించడం వంటివి కొనసాగితే కఠిన శిక్షలు తప్పవని భావిస్తున్నారు. ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఇలాంటి సంఘటనలు జరగడం పాకిస్థాన్ బోర్డు ప్రతిష్టకు పెద్ద దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా, ఐసీసీని ఒత్తిడిలో పెట్టేందుకు పీసీబీ వేసిన అడుగులు తిరుగుబాటు మాదిరిగా మారి, ఆ బోర్డు మెడకే చుట్టుకున్నాయి.

Earthquake: రష్యాను వణికించిన భారీ భూకంపం! సునామీ హెచ్చరికలు జారీ!
Gold silver Rates: తగ్గిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!
Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం! ఆర్టీసీ మరో గుడ్ న్యూస్! ఇక నో టెన్షన్!
Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!
Robo Shankar: తమిళ సినీ పరిశ్రమలో విషాదం.. హాస్యనటుడు రోబో శంకర్ కన్నుమూత!
Minister Speech: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అర్హులైన వారికి ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్‌లు! పట్టణాలకే కాదు పల్లెలకు కూడా..