అమెరికా టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు యాపిల్ భారత్లో తన మూడో స్టోర్ను ప్రారభించనుంది. దీనికోసం కర్ణాటక రాజధాని బెంగళూరును ఎంచుకుంది. హెబ్బాల్లోని ఫీనిక్స్ మాల్లో కొత్త స్టోర్ను ఏర్పాటు చేయనుంది. ఇక, ఇప్పటికే ఢిల్లీ, ముంబయి నగరాలలో ఉన్న స్టోర్లకు వచ్చిన ఆదరణతో విస్తరణ దిశగా అడుగులేస్తోంది. సొంత రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేస్తూ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.
బెంగళూరు ఫీనిక్స్ మాల్ మొదటి అంతస్తులో 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాపిల్ ఈ స్టోర్ను ఏర్పాటు చేయనుంది. ఈ స్థలాన్ని యాపిల్ పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు సమాచారం. రానున్న కొన్ని నెలల్లోనే ఈ స్టోర్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఢిల్లీలోని ఔట్లెట్ మాదిరిగానే ఈ స్టోర్ ఉండనుంది.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
కాగా, భారత్లో వ్యాపార వృద్ధికి ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయని ఇటీవల యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే దేశంలో మరో నాలుగు యాపిల్ స్టోర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలాఉంటే... యాపిల్ గ్లోబల్ వ్యూహంలో భారత్ కీలకంగా మారింది. విక్రయాలకు మాత్రమే కాకుండా ఉత్పత్తి కేంద్రంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!
చిక్కుల్లో కమల్ హాసన్.. బెంగళూరులో కేసు నమోదు! ఆయన వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం..
ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!
కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: