Header Banner

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

  Fri May 30, 2025 06:49        Politics

రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ నుంచి రేషన్‌ పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు తాజాగా పౌరసరఫరాల శాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ ఒకటో తేది నుంచే రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్నిచోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

MDU విధానం అమలులో ఉన్నపుడు ఈ-ఫోన్లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ తొలగించి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నెంబరు 218ని పౌరసరఫరాశాఖ కమీషనర్ సౌరబ్ర్తో కలిసి సందర్శించారు. ఈ-ఫోన్‌లో లాగిన్ నుంచి కార్డు నెంబరు ఎంటర్ అయ్యే విధానం కార్డుదారుని వేలిముద్ర, కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానం మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో MDU వాహనం ఎపుడు వస్తుందో, వెళుతుందో తెలియని దుస్థితి ఉందని అన్నారు.

దీంతో కార్డుదారులు రేషన్ కోసం.. వాహనం కోసం.. రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింన్నారు. ఇపుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని చెప్పారు. నెలలో ఒకటో తేది నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మద్యహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారాల్లోనూ రేషన్‌ పంపిణీ కొనసాగుతుందని ఆయన అన్నారు.

65 సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యభర్తలు ఇద్దరు వృద్దులైన వారి జాబితాలు రేషన్ షాపుల వారీగా సిద్ధం చేశామని, వారికి 1 నుంచి 5వ తేదిలోగా డీలర్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు. ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందవచ్చని చెప్పారు. రేషన్ దుకాణాలలో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికోత్తయాప్‌ను రూపొందించిందని చెప్పారు. ఈ యాప్‌లో డీలర్‌ వివరాలు ఫోటోతో సహా వస్తాయన్నారు. యంఎల్ఎస్ పాయంట్ నుంచి సరుకు ఎంత వచ్చింది.. కార్డుదారులకు ఎంత పంపిణీ చేశారనే.. వివరాలు రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా వెంటనే ఈ యాప్ ద్వారా తెలిసిపోతుందని మంత్రి చెప్పారు.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..



వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!


నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

భార‌త్‌లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్క‌డో తెలుసా?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #RationCard #RationUpdate #PublicAlert #NewTimings #RiceCardHolders #APNews #TelanganaNews