Header Banner

ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  Tue May 27, 2025 09:15        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే ఏర్పాటు కానుంది. నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ను అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసేలా గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ను అనుసంధానించేలా గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని, అలాగే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని నెలల పాటు లోతైన అధ్యయనం జరిపిన తర్వాత.. కన్సల్టెన్సీ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వానికి నాలుగు అలైన్‌మెంట్ ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. భూసేకరణకు అయ్యే ఖర్చు, ఆర్థికపరమైన సాధ్యాసాధ్యాలు, దూరం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఏజెన్సీ.. నాలుగు అలైనమెంట్లను ప్రతిపాదించినట్లు తెలిసింది.

సుమారుగా రూ.1400 కోట్లు ఖర్చుతో 48 కిలోమీటర్ల మేరకు ఈ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ రూ.1400 కోట్లలో రూ.300 కోట్లు భూసేకరణకు, మిగతా మొత్తం హైవే నిర్మాణం, వంతెన ఏర్పాటు కోసం ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. దాదాపుగా 24 చోట్ల ఈ హైవే నదిని, కాలువలపై వెళ్లాల్సి ఉంటుందని ఏజెన్సీ గుర్తించినట్లు తెలిసింది. సుండూర్ సమీపంలో రైల్వే ట్రాక్ మీద వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కన్సల్టెన్సీ ఏజెన్సీ రైల్వే ట్రాక్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి , కాలువ క్రాసింగ్ పాయింట్ల వద్ద హై-లెవల్ వంతెనల నిర్మాణాన్ని ప్రతిపాదించింది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాగానే ఆరు నెలల్లోపు భూసేకరణ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణ పూర్తి అయిన వెంటనే పనులను ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే కారణంగా తీరప్రాంతం అభివృద్ధి చెందుతుందని.. మత్స్యకారుల అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయని.. ఫలితంగా మత్స్యకారులకు మెరుగైన ధరలు దక్కుతాయని అధికారులు చెప్తున్నారు.

ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే ద్వారా సూర్యలంక, బాపట్ల బీచ్‌లకు చేరుకోవటం కూడా సులువు అవుతుంది. దీంతో ఈ ప్రాంతాలకు సందర్శకులు పెరుగుతారని, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం త్వరలోనే పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ మారీటైమ్ బోర్డు కూడా ఇప్పటికే నోఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్‌కు సంబంధించిన భూమిలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #AndhraPradesh #GreenfieldHighway #NationalHighwayProject #₹1400CrHighway #CentralApproval