Header Banner

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

  Tue Jun 03, 2025 08:31        Politics

ఏపిలో నదుల అనుసంధానంలో కీలక ప్రాజెక్టు గా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు పై కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆర్థిక సాకారం సహా ప్రాజెక్టు పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచారు ఏపీ అధికారులు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్ కు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు సుదీర్ఘ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టు పై కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలు అందించారు రాష్ట్ర అధికారులు. రూ.81 వేల కోట్ల తో ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…ఈ ప్రాజెక్టుతో రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ప్రజంటేషన్ ద్వారా వివరించారు. గత నెల జరిగిన భేటీల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని, ఆర్థిక మంత్రికి వివరించారు సీఎం చంద్రబాబు…సీఎం ప్రతిపాదన పై పూర్తి వివరాలు ఇవ్వాలని గతంలో కోరిన కేంద్ర ఆర్థిక శాఖ కోరిన నేపథ్యంలో నార్త్ బ్లాక్ ఆర్థిక శాఖ కార్యాలయంలో రెండుగంటల పాటు బనక చర్ల ప్రాజెక్టు గురించి చర్చ జరిగింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ప్రాజెక్టు సమగ్ర వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు వివరించిన అధికారులు: 
ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభ నష్టాలపై వివరాలను ఆర్థిక శాఖ అధికారులకు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. భవిష్యత్తులో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని వివరించారు. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై కూడా ప్రజంటేషన్ లో ఏపీ అధికారులు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సముద్రంలోకి వృధాగా పోతున్న సుమారు 2వేల టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని, గోదావరి నుంచి కృష్ణా కృష్ణ నది నుంచి పెన్నా తదుపరి పెన్నా నుంచి కావేరికి నదుల అనుసంధానం కొనసాగడంలో బనకచర్ల ప్రాజెక్టు చాలా కీలకం కానుందని ఆర్థిక శాఖ అధికారులకు ఏపీ అధికారులు సూచించినట్లు సమాచారం. 

 

బనకచర్ల ప్రాజెక్టు దేనికోసం
గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు గోదావరి– బనకచర్ల ప్రాజెక్టు. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేవలం వరద వచ్చే రోజుల్లోనే నీళ్లు తరలించనుండటంతో గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని భావిస్తోంది. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు రూ.80,112 కోట్లతో ప్రతిపాదనలు రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దీనికి ప్రధానమంత్రి కృషి సింఛాయ్‌ యోజన (పీఎంకేఎస్‌వై)– అక్సిలిరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్స్‌ ప్రోగ్రాం (ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్రా స్టేట్‌ లింక్‌ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం చర్చించారు. ఈ విషయాలను సైతం ఏపీ అధికారులు కేంద్ర అధికారులకు వివరించారు. 

 

మూడు దశల్లో ప్రాజెక్టు నిర్మాణం!
మూడు దశల్లో గోదావరి–బనకచర్ల అనుసంధానం చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల్లో పేర్కొంది. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలిస్తామని తెలిపింది.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణా నదికి జలాల మళ్లింపు:
పోలవరం జలాశయం నుంచి గోదావరి వరద జలాలు మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచుతారు. ప్రస్తుతం కుడికాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కులు ఉండగా, దాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచుతారు. అలానే తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 1,400 నుంచి పది వేల క్యూసెక్కులకు పెంచుతారు. కొత్తగా 25 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. పోలవరం కుడి కాలువతో పాటు ఈ కొత్త వరద కాలువను ఉపయోగించుకుని వరద జలాలను వైకుంఠపురం వరకు మళ్లిస్తారు. వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై ఆక్విడెక్ట్‌పై నిర్మించి అక్కడ ఈ వరద జలాలను కలుపుతారు. మొత్తంగా తొలి దశ పనులకు రూ.13,511 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. 

 

నీళ్లను తరలించడం:
కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్‌ కుడి కాల్వలో 80వ కిలోమీటరు వద్ద నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలిస్తారు. సాగర్‌ కుడికాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి, పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. 150 టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు..రెండో దశ పనులకు రూ.28,560 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు

 

మూడో దశలో నీళ్ల మళ్లింపు
బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుంచి నల్లమల అరణ్యం మీదు బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర తవ్వే సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు. మూడో దశ పనులకు రూ.38.041 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. మొత్తంగా ప్రాజెక్టుకు రూ.80,112 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.48 వేల ఎకరాల భూసేకరణ ఈ ప్రాజెక్టు కోసం 48 వేల ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ బనచకర్ల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 4 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. రెండుచోట్ల టన్నెళ్లు, 9 చోట్ల పంపు హౌస్‌ల నిర్మాణం అవసరమనీ, అలానే గ్రావిటీ కాలువ అవసరమైన చోట తవ్వాలని పేర్కొంది. ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు ఏపీ ఆర్థిక శాఖ నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. 

 

ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..! 

 

తెలంగాణ అభ్యంతరాలు కేంద్రానికి తెలపనున్న సిడబ్ల్యుసి
గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి బనకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏమిటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన గోదావరి–బనకచర్ల అనుసంధాన (లింక్‌) ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) లేఖ రాసింది. దీనిపై సీడబ్ల్యూసీ తెలంగాణకు కూడా లేఖ రాసి, ఆ రాష్ట్రం అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని కేంద్రానికి పంపించనుంది. 

 

బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ఎందుకు వ్యతిరేకిస్తోంది ?
ఏపీ ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టును తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. గోదావరి–బనకచర్ల ఆనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్‌ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పు పడుతోంది.ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి.. గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం దృష్టికి తెలంగాణ అభ్యంతరాలు తీసుకువెళ్లారు..తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సీతమ్మ సాగర్, సమ్మక్కసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి, వార్ధా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయి అనుమతులు రావాల్సి ఉంది. తెలంగాణ ప్రాజెక్టుల వాటా తేలకుండా గోదావరి నది నీళ్లను ఏపీ ఎలా తరలిస్తుందని రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు..గోదావరిలో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఆ మేరకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు ..మరి ఏపీ ఏకంగా ఒకేసారి 200 టీఎంసీల నీటిని ఎలా వినియోగించాలని ప్రతిపాదిస్తుందో అర్ధం కావడం లేదని విభజన చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్రం అదనంగా గోదావరి నీళ్ల వినియోగంతో పాటు కొత్త ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదిస్తే ముందుగా పక్క రాష్ట్రానికి తెలియజేయాలి. అలా కాకుండా ఏపీ ప్రభుత్వం నేరుగా కేంద్రానికి లేఖ రాసి నిధులు అడగడం అన్యాయమని విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 

 

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలని కోరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు, జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖలు రాశారు.సెంట్రల్‌ వాటర్‌ కమిషన్, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు. 

 

తెలంగాణకు నష్టం లేదంటున్న చంద్రబాబు:
కేవలం గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు అంటున్నారు. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకూ ఏపీకి తెలంగాణ ఎగువ రాష్ట్రం.. గోదావరిపై తెలంగాణ రాష్టం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు అంటున్నారు. గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఏపీకి గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి సైతం ఈ ప్రాజెక్టు నివేదిక అందజేశారు. కేంద్రమే మొత్తం భరించలేదు కాబట్టి హైబ్రిడ్‌ మోడల్‌లో నిధుల సమీకరణ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. గోదావరి –బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తైతే దేశంలోనే అతిపెద్ద ఇరిగేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు అంటున్నారు. డీపీఆర్‌ పూర్తి చేసి రెండు, మూడు నెలల్లో టెండర్లు పిలిచే ఆలోచనలో ఉన్నారు. 

 

సుప్రీంకోర్టు కెక్కనున్న బనకచర్ల ప్రాజెక్టు వివాదం:
గోదావరి నీటిని ఏపీ తరలించకపోతుందనీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు బిఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో రాజీలేదని బనక చర్ల ప్రాజెక్టు విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకు సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ తరపున పిటిషన్ సైతం ఫైల్ కాబోతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #PolavaramProject #BanakacharlaProject #APDevelopment #CentreReview #AndhraPradeshNews #CMChandrababu