ఆంధ్రప్రదేశ్లో తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ పోలీసు నియామక మండలి (AP SLPRB) ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులుగా మొత్తం 42 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తున్నారు.
రాత పరీక్షను అక్టోబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1 (ఆబ్జెక్టివ్ విధానం) ఉంటే, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పేపర్ 2 (డిస్క్రిప్టివ్ విధానం) ఉంటుంది. ఈ విషయాలను పోలీసు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా వెల్లడించారు. మరిన్ని వివరాలు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.