Pemmasani Chandrashekhar: ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి చికిత్స చేసి.. మానవత్వం చాటిన కేంద్ర మంత్రి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పలు కీలక చర్యలను చేపడుతోంది. మహిళలు ఆర్థికంగా బలపడేలా, స్వయం ఉపాధి పొందేలా అనేక పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది డ్వాక్రా సంఘాల ఏర్పాటు. ఈ సంఘాల ద్వారా సున్నా వడ్డీతో రుణాలు అందించి, మహిళలు తమ పాదాలపై నిలబడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

Mawa Samosa: నోరూరించే ఫేమస్ పంజాబీ మావా సమోసా! తేలికగా ఇంట్లోనే చేసుకోండి! శ్రావణ మాస పేరంటాల్లో స్వీట్!

ఇదే దిశగా, పట్టణ స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులైన డిగ్రీ చదివిన మహిళల కోసం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెడుతోంది. ఈ ప్రాజెక్ట్‌ పేరు “డిజి లక్ష్మి”. ప్రజలకు డిజిటల్ సేవలు సులభంగా అందించడంతో పాటు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA) ఆధ్వర్యంలో, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం.

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 9... ఈసారి సూపర్ స్పెషల్! మొదలయ్యేది ఎప్పుడంటే?

ఈ కార్యక్రమం కింద, సీఎస్‌ఈ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ తో భాగస్వామ్యంగా, పట్టణాల్లోని స్లమ్ లెవల్ సమాఖ్య పరిధిలో ఒక్కొక్క సీఎస్‌సీ కియోస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా వ్యాపార లైసెన్స్‌లు, రేషన్ కార్డు దరఖాస్తులు వంటి మీసేవా ద్వారా అందించే అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయి.

Gold rates: తగ్గిన బంగారం ధరలు.. వినియోగదారులకు ఊరట!

ప్రారంభ దశలో ప్రతి కియోస్క్‌లో ఒక డిగ్రీ చదివిన మహిళతో పాటు మరో ఇద్దరు మహిళలకు ఉపాధి లభిస్తుంది. మొదటగా సుమారు 20 రకాల సేవలు అందించనున్నారు. తర్వాత ఈ సేవల పరిధిని మరింత విస్తరించనున్నారు. పౌరులు నిర్దేశిత రుసుము చెల్లించి ఈ సేవలను పొందవచ్చు.

DSC results: డీఎస్సీ ఫలితాలపై నేడో, రేపో స్పష్టత.. ఫైనల్ కీపై అభ్యంతరాలు!

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, గూడూరు, బేతంచెర్ల ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం సుమారు 300 కుటుంబాలకు ఒక కియోస్క్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది.

Good News: వారికి భారీ శుభవార్త! ఈ రోజే మీ అకౌంట్లో డబ్బులు జమ... చెక్ చేసుకోండి!

ఈ విధంగా, డిజి లక్ష్మి ప్రాజెక్ట్ ద్వారా పౌర సేవలు ఇళ్ల దగ్గర్లోనే అందుబాటులోకి రావడంతో పాటు, డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.

Air india: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్‌! కేవలం రూ.1,279కే విమాన టికెట్‌..!
Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! మరో నాలుగు రోజుల వర్షాలు! ఈ జిల్లాల్లో...
Praja Vedika: నేడు (11/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటున్నారా... వద్దండోయే! వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసా!