మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Jaganmohan Reddy) టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddha Venkanna) ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారన్నారు. ఎక్స్లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్ట్ పెట్టారని మండిపడ్డారు. వంశీ, కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారని.. ఆరోజు వారందరితో బండ బూతులు తిట్టించిన జగన్..
ఇది కూడా చదవండి: కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. పారిశుద్ధ్యంపై స్పెషల్ ఫోకస్! స్వచ్ఛ దివస్లో కీలక వ్యాఖ్యలు!
ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. వారందరినీ ప్రోత్సహించాడు కాబట్టే జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. ‘‘నీకు 11 సీట్లు వచ్చాయంటే.. ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారు. అయినా నాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు సిగ్గూ శరం లేకుండా మాట్లాడినా జగన్ భుజం తట్టి ప్రోత్సహించాడు. వాళ్లిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదే. అలా ఎవరైనా వాగితే.. మా అధినేత చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేసేవారు. నీలాగా.. నీచమైన రాజకీయాలు చేసి ఇంట్లో డవాళ్లను తిట్టించే సంస్కృతి టీడీపీకి లేదు’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!
పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!
టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్ టోల్ చెల్లించాల్సిందే.!
జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!
వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్ఐఆర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: