గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. హైదరాబాద్ రాయదుర్గంలోని ‘మై హోం భుజా’ ఉన్న ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఔటర్ రింగ్రోడ్డు మీదుగా విజయవాడ తరలిస్తున్నట్టు తెలిసింది. అయితే, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారా? లేదంటే మరో కేసులోనా? అన్న విషయంలో స్పష్టత లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న దాడి జరిగింది. ఈ కేసులో వంశీ సహా 88 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 20న విచారణ జరగనుంది. అంతలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తాజా సమాచారం ప్రకారం రెండ్రోజుల క్రితం కేసు విత్ డ్రా చేసుకున్న సత్యవర్థన్, తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. సత్యవర్థన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా, తనను కిడ్నాప్ చేసి బెదిరించారని చెప్పిన సత్యకుమార్. దీంతో వల్లభనేని వంశీ, అనుచరులపై కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఐదుగురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది. వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు.. ఆయనపై BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వంశీ ఇంటికి పోలీసులు నోటీసులు కూడా అంటించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మార్కెట్లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?
వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..
ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..
మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్ కలకలం! ఫ్లైట్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి?
మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా..
వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!
విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం గుడ్న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!
హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..
ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!
ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!
ఏపీలో రెండు చోట్ల వైరస్ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: