Lookout Notice: 'నా అన్వేషణ' అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. పంజాగుట్ట పోలీసుల లుకౌట్ నోటీసులు! Rajahmundry: కలుషిత పాలే కారణమా? రాజమహేంద్రవరంలో మిస్టరీ వ్యాధిపై కొనసాగుతున్న విచారణ.! Mangalagiri Crime: మంగళగిరిలో దారుణం... టీవీ వాల్యూమ్ పెంచాడని భర్తను పొడిచి చంపిన భార్య! Epstein Case: ఎప్‌స్టీన్ కేసులో సంచలన మలుపు..! ప్రిన్స్ ఆండ్రూపై బిగుస్తున్న ఉచ్చు! Train track : ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. ఇంజిన్ ముందు మెటల్ ప్లేట్… ట్రాక్ క్లీన్ చేస్తూ! Goa Beach: గోవా పోలీసుల కఠిన నిర్ణయం... ప్రైవసీ భంగం చేస్తే జైలు తప్పదు! ఆ జిల్లాలో పెద్దపులి కలకలం.. పశువుల మందలపై దాడులు.. భయంలో గ్రామస్థులు! Fake milk: యూరియా డిటర్జెంట్‌తో నకిలీ పాలు.. 300 లీటర్లతో 1,800 లీటర్లు! Lucky draw: జాక్పాట్ అదృష్టం.. ఉడుపి యువకుడికి రూ.49 కోట్ల బిగ్ టికెట్ విజయం! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! Lookout Notice: 'నా అన్వేషణ' అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. పంజాగుట్ట పోలీసుల లుకౌట్ నోటీసులు! Rajahmundry: కలుషిత పాలే కారణమా? రాజమహేంద్రవరంలో మిస్టరీ వ్యాధిపై కొనసాగుతున్న విచారణ.! Mangalagiri Crime: మంగళగిరిలో దారుణం... టీవీ వాల్యూమ్ పెంచాడని భర్తను పొడిచి చంపిన భార్య! Epstein Case: ఎప్‌స్టీన్ కేసులో సంచలన మలుపు..! ప్రిన్స్ ఆండ్రూపై బిగుస్తున్న ఉచ్చు! Train track : ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. ఇంజిన్ ముందు మెటల్ ప్లేట్… ట్రాక్ క్లీన్ చేస్తూ! Goa Beach: గోవా పోలీసుల కఠిన నిర్ణయం... ప్రైవసీ భంగం చేస్తే జైలు తప్పదు! ఆ జిల్లాలో పెద్దపులి కలకలం.. పశువుల మందలపై దాడులు.. భయంలో గ్రామస్థులు! Fake milk: యూరియా డిటర్జెంట్‌తో నకిలీ పాలు.. 300 లీటర్లతో 1,800 లీటర్లు! Lucky draw: జాక్పాట్ అదృష్టం.. ఉడుపి యువకుడికి రూ.49 కోట్ల బిగ్ టికెట్ విజయం! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్!

controversy: ​వ్యూయర్ల చెవిలో పువ్వు... వివాదాలనే ఆదాయంగా మలుచుకుంటున్న అన్వేష్ యూట్యూబ్ ప్రయాణం!

యూట్యూబ్‌లో చిన్నగా మొదలైన ఒక ప్రయాణం ఎలా పెద్ద వివాదాలకు దారి తీస్తుందో చెప్పే తాజా ఉదాహరణ అన్వేష్ వ్యవహారం. ఒకప్పుడు కనీసం విదేశాలకు ప్రయాణం చేయడానికి కూడా సర

Published : 2026-01-03 13:34:00
Dwacra Womens: ఏపీలో వారికి పండగే పండగ... సంవత్సరానికి రూ.25 లక్షలు!

యూట్యూబ్‌లో చిన్నగా మొదలైన ఒక ప్రయాణం ఎలా పెద్ద వివాదాలకు దారి తీస్తుందో చెప్పే తాజా ఉదాహరణ అన్వేష్ వ్యవహారం. ఒకప్పుడు కనీసం విదేశాలకు ప్రయాణం చేయడానికి కూడా సరిపడా డబ్బులు లేని స్థితిలో ఉన్న అన్వేష్, తన వీడియోలను నమ్మిన సబ్స్క్రైబర్ల సహకారంతో ట్రావెల్ యూట్యూబర్‌గా ఎదిగారు. మొదట్లో తన ప్రయాణాలు, అనుభవాలను సాదాసీదాగా చెప్పుకుంటూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. మధ్యతరగతి వాళ్లకూ ఇది సాధ్యమే అనే నమ్మకాన్ని చాలామందిలో కలిగించిన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారు.

Traffic Rules: కొత్త రూల్స్ వచ్చేశాయ్! ఇక నుండి అవి తప్పనిసరి... చెల్లించక తప్పదు భారీ మూల్యం!

కానీ కాలం మారింది, గుర్తింపు పెరిగింది, ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇక్కడినుంచే అసలు సమస్య మొదలైంది. మన పరపతి పెరిగినప్పుడు మాటల్లో కూడా మార్పు వస్తుందని అంటారు. అన్వేష్ విషయంలో అది అహంకారం కంటే ‘అతి తెలివి’గా మారింది. యూట్యూబ్ ట్రావెలింగ్ విభాగంలో ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంటున్న వారిని టార్గెట్ చేస్తూ, వారిని కించపరిచేలా మాట్లాడటం ద్వారా సమాజంలో నేను మాత్రమే మంచి చేస్తున్నాననే భావనను వ్యూవర్లలో కల్పించడానికి ప్రయత్నించారు.

Farmers: కర్నూల్‌ రైతుల ఖాతాల్లో నిధులు…! మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

సమాజ సేవ చేస్తున్నట్టు మాట్లాడుతూ, సబ్స్క్రైబర్ల నమ్మకాన్ని ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తులను అవమానించే ధోరణి అన్వేష్‌లో కనిపించిందని పలు వీడియోల ద్వారా స్పష్టమైంది. ఈ క్రమంలోనే మొదటగా ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్, భయ్యా సన్నీ యాదవ్ లాంటి వారిని ఆయన టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Earthquake Horror: మెక్సికోలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు..! భయాందోళనలో ప్రజలు..!

వారి కుటుంబాల్లోని అమ్మానాన్నలు, భార్య, చెల్లెల్లు, తమ్ముళ్లు, అన్నలు, మరదళ్లు గురించి అసభ్యంగా మాట్లాడిన విషయాలు కూడా అందరికీ తెలిసినవే. వ్యక్తిగత విషయాలు ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి కానీ, అన్వేష్ సోషల్ మీడియాలో బూతులు ఉపయోగిస్తూ వారి కుటుంబాలను కించపరిచేలా మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. అదేవిధంగా వారి కంటెంట్‌ను విమర్శించే పేరుతో తక్కువ చేసి మాట్లాడారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇక్కడ అన్వేష్ ఒక విషయం గమనించారు. ఎదుటి వ్యక్తులపై మాట్లాడినప్పుడల్లా వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రిప్షన్లు కూడా వస్తున్నాయి. ఈ ఫార్ములానే తనకు పనిచేస్తోందని భావించి అదే దారిలో నేటికీ కొనసాగుతున్నారు.

సావిత్రి బాయి పూలే జయంతి ..చంద్రబాబు, లోకేశ్ నివాళి! పురుషులకన్నా మిన్నగా...

యాక్టర్ శివాజీ అంశానికి సంబంధించిన వివాదంలో మాట్లాడడం ద్వారా అన్వేష్ భారీగా సబ్స్క్రైబర్లను కోల్పోయారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించే ఉదాహరణగా ఈ ఘటనను చెప్పుకోవచ్చు. భారతీయ సాంప్రదాయంలో ఎంతో గౌరవించబడే ద్రౌపది మాత, సీతమ్మ, శ్రీరాముడు వంటి దేవతలను కించపరిచేలా అన్వేష్ మాట్లాడారని విమర్శలు వచ్చాయి. వయసులో పెద్దవారు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పే గరికపాటి నరసింహారావును కూడా వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, వివాదాల వల్ల వ్యూస్ పెరుగుతున్నాయి, ఆర్థిక వనరు అన్వేష్‌కు లభిస్తోంది. దీనికి మనమే పుల్ స్టాప్ పెడితే ఇలాంటి వారికి అవకాశాలు తగ్గుతాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Akhanda-2: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి అఖండ–2 ఎప్పుడు అంటే!

ఇదే నేపథ్యంలో యూట్యూబర్ యే జూడ్‌తో అన్వేష్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తన గురించి, తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడని యే జూడ్ తన వీడియోలో తెలిపారు. ఘాటుగా స్పందిస్తూ, అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇటీవల పెట్టిన వీడియోను మరోసారి రీ-అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో ఆయన మాటలు నేరుగా, స్పష్టంగా ఉండటంతో సోషల్ మీడియాలో విస్తృత స్పందన వచ్చింది.

భీకర ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టులకు భారీ దెబ్బ! ఉదయం 5.30 గంటలకు..

తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ యే జూడ్ పూర్తిగా ఖండించారు. వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం జరుగుతోందని, ముఖ్యంగా తన కుటుంబాన్ని లాగుతూ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తన తండ్రి 32 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని, ఆ సుదీర్ఘ కాలంలో ఎలాంటి మచ్చ లేకుండా విధులు నిర్వహించారని గర్వంగా చెప్పారు.

NEP ఫోకస్‌తో ఏపీ విద్యా విధానంలో సంస్కరణలు…! పదో తరగతికి కొత్త రూల్స్!

బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేశారన్న ఆరోపణలపై కూడా ఆయన సవాల్ విసిరారు. తాను ఇప్పటివరకు ఏ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయలేదని, ఒక్క ఆధారం చూపినా బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చాలా ప్రమాదకరమని, సోషల్ మీడియాలో ఎవరి మీదైనా ముద్ర వేయడం చాలా సులభమైపోయిందని వ్యాఖ్యానించారు.

Aadhaar drive: ఏపీలో ప్రత్యేక ఆధార్ డ్రైవ్.. స్కూల్ నుంచే బయోమెట్రిక్ అప్డేట్!

ఈ వివాదంలో అత్యంత సున్నితమైన అంశం దైవాలపై చేసిన వ్యాఖ్యలేనని యే జూడ్ స్పష్టం చేశారు. సీతమ్మ తల్లి, ద్రౌపది మాత, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి వంటి దేవతల గురించి అవమానకరంగా మాట్లాడటం కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, చరిత్రను వక్రీకరించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను లేవనెత్తారు. అదేవిధంగా బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ప్రయత్నాలు జరిగినా తాను భయపడబోనని, ధర్మం కోసం నిలబడి పోరాడతానని స్పష్టం చేశారు.

Andhra Pradesh: ఏపీలో పెట్టుబడుల ఊపు.. కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభం!
ఆ గ్రామాల్లో 22 లక్షల పుస్తకాల పంపిణీ.. ఒకరోజు పంపిణీలో పాల్గొననున్న చంద్రబాబు!
West Bypass: ఏపీలో ఆ వెస్ట్ బైపాస్ శుభారంభం! ట్రాఫిక్ ఫ్రీ జర్నీ... గంట సమయం ఆదా!
Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... లివర్ సమస్య ఉన్నట్లే! జర భద్రం గురూ!
Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!

Spotlight

Read More →