AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు!

Minister Atchannaidu: భూగర్భ జలాల పరిరక్షణ... ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం! 15 లక్షల హెక్టార్లలో..

Minister Atchannaidu: రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూట‌మి ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు.

Published : 2026-03-04 13:33:00
  • విప‌త్తుల బారిన‌ ప‌డ‌కుండా ఖరీఫ్ రెండు నెల‌ల‌ ముందుకు... రైతుల‌కు ప్రత్యేక అవగాహన కార్య‌క్ర‌మాలు..
     
  • క్రాప్ డైవర్షన్, మద్దతు ధరలు, సేంద్రీయ వ్య‌వ‌సాయం, కౌలు రైతుల రుణాలపై అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు సమగ్ర వివరణ..

Minister Atchannaidu: రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూట‌మి ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. క్రాప్ డైవర్షన్, మద్దతు ధరలు, సేంద్రీయ వ్య‌వ‌సాయం, కౌలు రైతుల రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ, 2025–26 క్రాప్ ఇయర్‌కు రాష్ట్రంలో వ‌రి సాగు చేస్తున్న రైతులు మొత్తం 38.97 లక్షల మంది ఉన్నార‌ని, అందులో ఖరీఫ్ 26.94 లక్షలు, రబీ 12.03 లక్షల మంది ఉన్నార‌ని వెల్లడించారు. అధిక వరి సాగు ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల వంటి పంటలను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన విత్తనాల సరఫరా, సాంకేతిక మార్గదర్శకాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 

2025–26 సంవత్సరానికి సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి ప్రణాళిక అమలు చేస్తున్నామని, ఎన్ జీ రంగా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా ఆధునిక విత్తనాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యత నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణ అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, సాగునీటి లభ్యత పెరిగినప్పటికీ వరిపై అధిక ఆధారపడటం రైతులకు గిట్టుబాటు కాదని తెలిపారు. వరిని పూర్తిగా మానేయాలని ప్రభుత్వం చెప్పడం లేదని, అయితే పాత వంగడాల బదులు నాణ్యమైన, ఎగుమతులకు అనుకూలమైన కొత్త వంగడాలను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. మొదటి దశలో రాయలసీమ జిల్లాల నుండి ప్రకాశం జిల్లా వరకు 15 లక్షల హెక్టార్లలో క్రాప్ డైవర్షన్ చేపట్టి హార్టికల్చర్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం ద్వారా 30,000 కోట్లు, ప్రైవేట్ రంగం ద్వారా 70,000 కోట్లు సమీకరించి హార్టికల్చర్ అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నామ‌ని వెల్లడించారు. సంవ‌త్స‌ర కాలంలో రైతుల‌కు వరి పంటలో ఎకరాకు సుమారు ₹6,000 ఆదాయం మాత్రమే వస్తుండగా, కంది పంట‌కు 26,000, మినుముల పంట‌కు 21,000, జొన్న పంట‌కు 16,000, పామాయిల్ పంట‌కు 1.50 ల‌క్ష రూపాయ‌ల‌ లాభం వ‌స్తుంద‌ని వివరించారు. డైవర్షన్‌కు ముందుకొచ్చే రైతులకు పామాయిలు ఉచిత మొక్కలు, సాంకేతిక సలహాలు, డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలు కల్పించి, పండించిన పంటలను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మొక్కజొన్నకు ₹2400 మద్దతు ధర ప్రకటించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 

ప్రస్తుతం రిజర్వాయర్లలో 90 శాతం నీటి నిల్వలు ఉన్నందున ఖరీఫ్ సాగును రెండు నెలలు ముందుకు తీసుకురావాలని, మే నెల‌లో ఖ‌రీప్ ప్రారంభం అయ్యేలా ప్ర‌తి గ్రామంలో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నామని, ఎమ్మెల్యేలు రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. కౌలు రైతుల విషయానికి వస్తే, 9.13 లక్షల మందికి సీసీఆర్‌సీ కార్డులు జారీ చేసి ₹4474 కోట్లు రుణాలుగా మంజూరు చేశామని వెల్లడించారు. రైతుల ఆదాయ వృద్ధి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు.

Spotlight

Read More →