⚡ BREAKING
Andhra Pradesh

తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభం జల చరిత్రలో సువర్ణ అధ్యాయం

Chandrababu: తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల ప్రాధాన్యతను వివరించారు. తుంగభద్ర తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొంటూ, ఈ నది మూడు రాష్ట్రాల ప్రజల జీవనాధారమని అన్నారు.

Chandra Babu Naidu

ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు.. వాటిని కాపాడుకోవాలి: చంద్రబాబు..

ఆరు నెలల్లో 33 గేట్ల ఏర్పాటు.. చారిత్రాత్మక ఘట్టమన్న సీఎం..

హోసపేట: తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల ప్రాధాన్యతను వివరించారు. తుంగభద్ర తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొంటూ, ఈ నది మూడు రాష్ట్రాల ప్రజల జీవనాధారమని అన్నారు.

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు, “తుంగా పానం.. గంగా స్నానం” అనే సామెతను గుర్తు చేశారు. తాగడానికి స్వచ్ఛమైన నీటిని అందించే నదిగా తుంగభద్రకు ప్రత్యేకత ఉందని, పుణ్యానికి గంగానది ఎంత గొప్పదో, జీవనాధారంగా తుంగభద్ర అంత ముఖ్యమైనదని అన్నారు.

ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాల వంటివని, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టులు సక్రమంగా ఉంటేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత ఉంటుందని అన్నారు.

తుంగభద్ర నది మూడు రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు, ప్రజలకు జీవనోపాధిని అందిస్తోందని పేర్కొన్నారు. తుంగభద్ర లేకపోతే చాలా తీవ్రమైన సమస్యలు ఎదురయ్యేవని అన్నారు.

భారీ సవాలుగా మారిన తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల సమస్యను తక్కువ సమయంలో పరిష్కరించిన ఇంజినీర్లు, అధికారులు, సిబ్బందిని సీఎం అభినందించారు. కేవలం ఆరు నెలల్లో 33 కొత్త గేట్లను ఏర్పాటు చేయడం గొప్ప విజయమని పేర్కొన్నారు. ఈ పనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు.

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలవడం చరిత్రాత్మక పరిణామమని చంద్రబాబు అన్నారు. ఇది భవిష్యత్తులో మూడు రాష్ట్రాల మధ్య సమన్వయానికి, జల సమస్యల పరిష్కారానికి మంచి ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతోందని తెలిపారు.

జలవనరులను కాపాడుకోవడం, నీటిని సమర్థంగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నీటి వృథాను అరికట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, మూడు రాష్ట్రాల ప్రజల నీటి భవిష్యత్తుకు భరోసా కల్పించే చారిత్రాత్మక అడుగని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Tags

Be the first to react

More Coverage