కోటనెమలిపురి (రాజుపాలెం): మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ ఇస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామ సర్పంచి కొరివి అనిల్ కుమార్, ఇదే మండలం నందిగామ ఎంపీటీసీ సభ్యురాలు సయ్యద్ సీమా భర్త రఫి అహమ్మద్ హెచ్చరించారు.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురిలో అంబటి అసమ్మతివర్గం నాయకులు సోమవారం విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఎలా ఇబ్బంది పెట్టారో వివరించారు. అనుచరులను పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని, సర్పంచులను అథోగతి పాల్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబటిని మాపై రుదొద్దంటూ జగన్ కు చేతులెత్తి దండం పెడుతున్నామన్నారు. వైకాపా నాయకుడు వెన్నా వెంకటరెడ్డి మాట్లాడుతూ అక్రమ మైనింగ్ కోసం కోటనెమలిపురి హద్దుల్ని అంబటి మార్చేశారని, చివరకు ఊరికి శ్మశానవాటిక లేకుండా చేశారన్నారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యురాలిని గృహ నిర్బంధం చేసి 'గడప గడపకు’ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత అంబటికే దక్కుతుందని సత్తెనపల్లి మండలం అబ్బూరు ఎంపీటీసీ సభ్యురాలు యార్లగడ్డ అలేఖ్య భర్త కృపాకరరావు పేర్కొన్నారు. అంబటి రాంబాబు పై అన్ని సామాజికవర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్నారు. పార్టీ శ్రేణుల అభిప్రాయానికి భిన్నంగా అంబటికి మళ్లీ సత్తెనపల్లిలో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే సర్పంచి పదవికి రాజీనామా చేస్తానని గుడిపూడి సర్పంచి తొరటి తిరుపతయ్య చెప్పారు. ముప్పాళ్ల జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఇందూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ మంత్రి అంబటి రాంబాబు ఓడిపోవడం ఖాయమన్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసే వాళ్లందరూ ఆయన వల్ల ఎంతో నష్టపోయారని పెదమక్కెన ఎంపీటీసీ సభ్యురాలు విజయకుమారి చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు రమేష్ రెడ్డి , రోశిరెడ్డి, మహేంద్ర, సర్పంచులు భూలక్ష్మి విజయ్ కుమార్, వెంకటకృష్ణారెడ్డి, వార్డు కౌన్సిలర్ సతీష్, మాజీ సర్పంచులు భాస్కరరెడ్డి, సీతమ్మవెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, రత్నం, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి