ఇది కూడా చదవండి: Tata Motors: రెండుగా విడిపోతున్న టాటా కంపెనీ! ఛైర్మన్ కీలక ప్రకటన!


తెలుగు రాష్ట్రాలకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే-65ను ఆరు లైన్లుగా విస్తరించబోతున్నారు.. ఈ మేరకు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ హైవేను విజయవాడ సమీపంలోని గొల్లపూడి వరకు విస్తరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. NHAI మాత్రం ఈ విస్తరణను కంచికచర్ల వరకే పరిమితం చేయాలని చూస్తోంది.. వెంటనే స్పందించిన చంద్రబాబు గతంలో ఉన్న ప్రతిపాదన ప్రకారమే గొల్లపూడి వరకు ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఈ హైవే హైదరాబాద్-విజయవాడ మధ్య కనెక్టివిటీకి చాలా ముఖ్యమని.. గొల్లపూడి వరకు విస్తరిస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. అదేవిధంగా విజయవాడ-మచిలీపట్నం హైవేను కానూరు నుంచే ఆరు వరుసలుగా విస్తరించాలని కోరుతూ గడ్కరీకి మరో లేఖ రాశారు.

ఇది కూడా చదవండి: Global Investors: ఆ విమానాశ్రయానికి మహర్దశ! బిలియన్ డాలర్లను సమీకరించిన అదానీ గ్రూప్!


నేషనల్ హైవే 65లో హైదరాబాద్ నుంచి మల్కాపూర్ వరకు 40 కి.మీ మేర ఆరు వరుసల రోడ్డు ఉంది. అయితే మల్కాపూర్ నుంచి విజయవాడ శివారులోని గొల్లపూడి వరకు 226 కి.మీ రోడ్డును నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరించాలని గతంలో ప్రతిపాదించారు. కానీ కొన్ని కారణాలతో కుదరలేదు.. గతంలో ఈ హైవే కాంట్రాక్ట్ సంస్థకు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య వివాదాల ఉన్నాయి. ఈ కారణంగా కోర్టు కేసులు కూడా నడిచాయి.. అందుకే రోడ్డు విస్తరణ పనులు జరగలేదు. ఈ క్రమంలో గతేడాది జీఎంఆర్ సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో.. NHAI అధికారులు విస్తరణకు సిద్ధమయ్యారు. ఈ 226 కి.మీ రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించేందుకు రూ.8,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.. ఈమేరకు డీపీఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

NHAI అధికారులు ఈ హైవేను గొల్లపూడి వరకు కాకుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ అయ్యే కంచికచర్ల వరకే విస్తరించాలని చూస్తున్నారు. అప్పుడు ఈ హైవే 226 కి.మీ బదులు 198 కి.మీ మాత్రమే విస్తరిస్తారు. కంచికచర్ల నుంచి గొల్లపూడి వరకు 28 కి.మీ రోడ్డు నాలుగు వరుసలుగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో వెంటనే స్పందించి కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు.. గొల్లపూడి వరకు ఆరు వరుసలు చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి: Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!


విజయవాడ-మచిలీపట్నం హైవే విషయానికి వస్తే.. నగరంలోని బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు 65 కి.మీ ఉంటుంది. ముందు కానూరు నుంచి మచిలీపట్నం వరకు 61 కి.మీ రోడ్డును విస్తరించాలని ప్రతిపాదించారు. అయితే బెంజ్ సర్కిల్ నుండి కానూరు వరకు చాలా భవనాలు ఉండటంతో అక్కడ సేకరించిన భూమి వెడల్పు 30 మీటర్లు మాత్రమే ఉండటంతో ఆరు వరుసలు చేయడం సాధ్యం కాదన్నారు. కానూరు నుంచి ROW 60 మీటర్ల మేర ఉంది.. కానూరు నుంచి మచిలీపట్నం వరకు 61 కి.మీ ఆరు వరుసలుగా విస్తరిస్తారని భావించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మాత్రం ఈ హైవేను కంకిపాడు దాటిన తర్వాత నెప్పల్లి దగ్గర అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర క్రాస్ అవుతుందని.. అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 46 కిలోమీటర్లు ఆరు లైన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. అప్పుడు కానూరు నుంచి నెప్పల్లి వరకు నాలుగు వరుసలు ఉంటుంది. అయితే ఈ అంశంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విజయవాడ-మచిలీపట్నం హైవే విషయంలో కూడా చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీకి మరో లేఖ రాశారు. నెప్పల్లి దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కాకుండా విజయవాడ నగర పరిధిలో కానూరు నుంచే ఆరు వరుసలుగా విస్తరించాలని కోరారు. విజయవాడలో ట్రాఫిక్, నగరం విస్తరిస్తోందని.. అందుకే కానూరు నుంచి హైవే చేపట్టాలని కోరారు. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Innovation Center: అమరావతిలో టాటా ఇన్నోవేషన్ హబ్! అతి భారీ మొత్తంలో పెట్టుబడి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

 Farmers Welfare: సర్కార్ శుభవార్త! మీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకోండి!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

Amaravathi works: అమరావతికి తిరిగి ఊపిరి... టెండర్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

Indian Railways: ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ...! ఎప్పట్నించి అంటే!

 Airport Luggage Missing: ఎయిర్‌పోర్టులో లగేజీ పోయిందా? వెంటనే ఇలా చేయండి!

Clarity about Transfers: ఏపీ సచివాలయ ఉద్యోగులకు నో టెన్షన్! బదిలీల్లో అవి వర్తించవు!

 Sarkar Decision: ఏపీ సర్కారు షాకింగ్ డెసిషన్! నేడు కీలక భేటీ!

South India Tour: ఒకే ట్రిప్​లో "పద్మనాభ స్వామి టూ మదురై మీనాక్షి"! ప్యాకేజీలు ఇవే!

TTD Scan Process: టీటీడీ కీలక నిర్ణయం! జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు.. క్యూలైన్లో నిలబడక్కర్లేదు!

Ration Cutting: రేషన్‌కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?

Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!

AP Inner Ring Road: ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడేమారనున్న రూపురేఖలు! వారి కళ్ళల్లో ఆనందం..

Auto drivers: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త..! ఆటోడ్రైవర్లకు డబ్బులు.. ముహూర్తం ఫిక్స్..!

 Praja Vedika: నేడు (25/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group