ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో పనిచేసే సచివాలయ ఉద్యోగులను ఇకపై సొంత వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల బదిలీలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సందేహాలకు క్లారిటీ లభించిందని అధికారులు పేర్కొన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల మాదిరిగా వార్డు సచివాలయ ఉద్యోగులకూ సొంత మండలాల్లో కాకుండా ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే విధానాన్ని కొనసాగించనున్నారు. అవసరమైతే జిల్లా పరిధిలోని ఇతర పట్టణాలు, నగరాల్లోని వార్డులకు కూడా బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి: New Muncipalities: రాష్ట్రంలో కొత్తగా రెండు మున్సిపాలిటీలు.. మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్! ఆ గ్రామాలకు మహర్దశ

ఇక విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌తో రాష్ట్రం సమన్వయం చేసేందుకు కళాశాల విద్యా డైరెక్టర్ నారాయణ భరత్‌గుప్తాను నియమించింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసింది. దీనితో పాటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు జూలై 12 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సమగ్ర శిక్షా అభియాన్ సూచించింది. 6–14 ఏళ్ల పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: Employement News: డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు! ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే!

అదనంగా, రాష్ట్రంలోని సాగు పథకాలకూ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోంది. APIIATP (ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటిపారుదల, వ్యవసాయ మార్పిడి పథకం) కింద పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపునకు రూ.20.64 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పాలనామోద ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: New International Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌.. తొలిసారి విమానం గాల్లో చక్కర్లు! ఫుల్ జోష్...!

అంతేగాక, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలకంగా పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. టెండర్ల పర్యవేక్షణ కోసం సాంకేతిక కమిటీని పునరుద్ధరించింది. ఈ కమిటీలో APADCL ఎండీతో పాటు APIIC, పంచాయతీరాజ్, మారిటైం బోర్డు తదితర శాఖల నుంచి మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. ఈ చర్యలన్నింటితో రాష్ట్రంలో పరిపాలన, విద్య, మౌలిక సదుపాయాల రంగాల్లో సమగ్ర అభివృద్ధికి బాటలు వెచ్చించనుంది.

ఇది కూడా చదవండి: Tunnel works: సొరంగ మార్గానికి రూ.920 కోట్లు! ఇక దూసుకెళ్లిపోవచ్చు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

 Sarkar Decision: ఏపీ సర్కారు షాకింగ్ డెసిషన్! నేడు కీలక భేటీ!

South India Tour: ఒకే ట్రిప్​లో "పద్మనాభ స్వామి టూ మదురై మీనాక్షి"! ప్యాకేజీలు ఇవే!

TTD Scan Process: టీటీడీ కీలక నిర్ణయం! జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు.. క్యూలైన్లో నిలబడక్కర్లేదు!

Ration Cutting: రేషన్‌కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?

Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!

Oil Supply Issues: హార్మూజ్ జలసంధి మూసివేత వైపు ఇరాన్? భారత్‌లో ఆయిల్ పరిస్థితిపై కేంద్రం కీలక ప్రకటన!

Singayya Case: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్.?

security Lapses: నలుపురంగు కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు! సీసీటీవీ ఫుటేజీలో.!

Sajjala Criminal Case: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. వివరాలు ఇవే.!

Former Minister Case: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్ పర్యటనలో నిషేదాజ్ఞల ఉల్లంఘన! మాజీ మంత్రిపై కేసు నమోదు!

AP Inner Ring Road: ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడేమారనున్న రూపురేఖలు! వారి కళ్ళల్లో ఆనందం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group