NREGA Workers: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త..! జీతాల కోసం రూ.1,668 కోట్లు విడుదల చేసిన కేంద్రం..!

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆధ్వర్యంలో సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 455 ఖాళీలను ఈ ప్రకటనలో భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి 9, తెలంగాణకు 7 పోస్టులు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలు (SIBs)లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి (మెట్రిక్యూలేషన్) ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, కనీసం ఏడాది డ్రైవింగ్ అనుభవం, మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి. అదనంగా అభ్యర్థులు సంబంధిత రాష్ట్రానికి చెందిన డొమిసైల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి.

Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ..! అంతర్జాతీయ టెక్ హబ్ దిశగా..!

అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 28, 2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు లభిస్తుంది. దరఖాస్తు ఫీజు కింద యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ పురుష అభ్యర్థులు రూ.650, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాలి. ఎంపిక ప్రక్రియలో టైర్‌–1, టైర్‌–2 రాతపరీక్షలు, డ్రైవింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది.

Chandrababu Meeting: "సూపర్ హిట్" బహిరంగ సభ! కూటమి బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు కొత్త భరోసా..!

రాతపరీక్షలో టైర్‌–1 పరీక్ష 100 మార్కులకు జరగనుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్‌, ట్రాన్స్‌పోర్ట్/డ్రైవింగ్ రూల్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి విభాగాలకు 20 మార్కులు చొప్పున ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. టైర్‌–2 పరీక్ష 50 మార్కులకు జరుగుతుంది. ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం సెప్టెంబర్ 6, 2025, చివరి తేదీ సెప్టెంబర్ 28, 2025. ఫీజు చెల్లింపుకు సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు ఉంది. రాతపరీక్ష తేదీలు త్వరలో ప్రకటించనున్నారు.

YCP Attacks: హై టెన్షన్.. భక్తి ముసుగులో బరితెగింపు.. పోలీసులపైనే వైకాపా నాయకుల దాడి!
Lokesh Tour: విద్యార్థులకు పండగలాంటి వార్త! ఒక్క పర్యటన.. కీలక ఒప్పందం! లోకేశ్ కృషితో కలిసిన బంధం..
AP Metro Update: రూ. 21,616 కోట్ల భారీ పెట్టుబడి.. మెట్రో ప్రాజెక్టులకు టెండర్ల గడువు పొడిగింపు! రెండు దశల్లో.!
East India Petroleum: పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్‌పై పిడుగు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు.. ఆకాశాన్ని తాకిన అగ్నిజ్వాలలు!
Full rains: ఈ జిల్లాలో ప్రజలకు హెచ్చరికలు.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం! 30 గొర్రెలు మృతి, మగ్గురికి గాయాలు!
ఇకపై కెమికల్ డై అవసరం లేదు.. తెల్ల జుట్టు మాయం చేసే సహజ మార్గం ఇదే!
AP Farmers: రైతులకు గుడ్ న్యూస్! త్వరలోనే భూ ఆరోగ్య కార్డుల పంపిణీ ప్రారంభం!