Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు..! అసెంబ్లీ సమావేశాలకు ముందే..!

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. మెట్రో నిర్మాణానికి పిలిచిన టెండర్ల గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. కాంట్రాక్టు సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. విజయవాడ మెట్రో టెండర్ గడువు అక్టోబర్ 14 వరకు, విశాఖ మెట్రో టెండర్ గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించారు.

Jobs: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్‌..! IBలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్!

ఈ ప్రాజెక్టుల ఫస్ట్‌ ఫేజ్ పనులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దశలోనే మొత్తం రూ.21,616 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఇందులో కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం నిధులు సమకూర్చగా.. మిగిలిన 60 శాతం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా పొందనున్నారు. తక్కువ వడ్డీ రుణాల కోసం కేంద్రం ప్రత్యేకంగా సహకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాను విశాఖ నగరపాలక సంస్థ, సీఆర్డీఏ సమకూర్చనున్నాయి.

NREGA Workers: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త..! జీతాల కోసం రూ.1,668 కోట్లు విడుదల చేసిన కేంద్రం..!

విశాఖ మెట్రో రైల్ ఫేజ్‌-1లో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో నిర్మాణం జరగనుంది. ఇందులో 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మార్గం ఉంటుంది. ఇక విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫస్ట్‌ ఫేజ్‌లో 38.40 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో నిర్మాణం చేపడతారు. ఇందులో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఉండనుంది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు పూర్తవుతే ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ..! అంతర్జాతీయ టెక్ హబ్ దిశగా..!
Chandrababu Meeting: "సూపర్ హిట్" బహిరంగ సభ! కూటమి బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు కొత్త భరోసా..!
YCP Attacks: హై టెన్షన్.. భక్తి ముసుగులో బరితెగింపు.. పోలీసులపైనే వైకాపా నాయకుల దాడి!
Lokesh Tour: విద్యార్థులకు పండగలాంటి వార్త! ఒక్క పర్యటన.. కీలక ఒప్పందం! లోకేశ్ కృషితో కలిసిన బంధం..
AP Metro Update: రూ. 21,616 కోట్ల భారీ పెట్టుబడి.. మెట్రో ప్రాజెక్టులకు టెండర్ల గడువు పొడిగింపు! రెండు దశల్లో.!
East India Petroleum: పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్‌పై పిడుగు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు.. ఆకాశాన్ని తాకిన అగ్నిజ్వాలలు!
Full rains: ఈ జిల్లాలో ప్రజలకు హెచ్చరికలు.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం! 30 గొర్రెలు మృతి, మగ్గురికి గాయాలు!