Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ..! అంతర్జాతీయ టెక్ హబ్ దిశగా..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త లభించింది. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికులకు జీతాలు చెల్లించేందుకు కేంద్రం రూ.1,668 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో కూలీల బ్యాంక్ ఖాతాల్లో బకాయిలు జమ చేయనున్నారు. మే 15 తర్వాత నుంచి జీతాలు ఆలస్యమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది. వెంటనే స్పందించిన కేంద్రం ఈ నిధులను విడుదల చేయడంతో, ఆగస్టు 15 వరకు ఉన్న బకాయిలు తీర్చివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇంకా రూ.137 కోట్లు అవసరమవుతాయని, అవి కూడా త్వరలోనే వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

Chandrababu Meeting: "సూపర్ హిట్" బహిరంగ సభ! కూటమి బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు కొత్త భరోసా..!

ఇక, పర్యాటక శాఖ–కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) కలిసి ఒక కీలక ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పర్యాటక ప్రదేశాలు, జాతీయ రహదారులపై ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు సులభంగా సేవలు అందించడమే ఈ ఒప్పందం ఉద్దేశం. మిషన్ లైఫ్‌లో భాగంగా 75 ముఖ్యమైన అంశాలను గుర్తించగా, పర్యాటక ప్రాంతాల్లో LED లైట్లు, సౌరశక్తి వినియోగం పెంపుతో పాటు ప్రజారవాణా, ఈవీ వాహనాలు, ఈవీ సైకిళ్ల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించనున్నారు.

YCP Attacks: హై టెన్షన్.. భక్తి ముసుగులో బరితెగింపు.. పోలీసులపైనే వైకాపా నాయకుల దాడి!

ఇదిలా ఉంటే, ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల కోసం APPSC రాతపరీక్ష నిర్వహించబడింది. 13 జిల్లాల్లో జరిగిన ఈ పరీక్షలకు మంచి హాజరు నమోదైంది. FBO పోస్టులకు దరఖాస్తు చేసిన 1,07,969 మందిలో 97,038 మంది హాజరయ్యారు. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసిన 17,824 మందిలో 15,412 మంది పరీక్ష రాశారని కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు. మరోవైపు, విజయవాడలో ఈ నెల 8 నుంచి 14 వరకు గాంధీ శిల్ప్ బజార్, లేపాక్షి హస్తకళల ప్రదర్శన జరగనుంది. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, కేంద్ర వస్త్ర మంత్రిత్వశాఖ, లేపాక్షి కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో హస్తకళాకారులు తమ ప్రతిభను చూపనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర హస్తకళల అభివృద్ధికి దోహదం చేయనుంది.

Lokesh Tour: విద్యార్థులకు పండగలాంటి వార్త! ఒక్క పర్యటన.. కీలక ఒప్పందం! లోకేశ్ కృషితో కలిసిన బంధం..
AP Metro Update: రూ. 21,616 కోట్ల భారీ పెట్టుబడి.. మెట్రో ప్రాజెక్టులకు టెండర్ల గడువు పొడిగింపు! రెండు దశల్లో.!
East India Petroleum: పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్‌పై పిడుగు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు.. ఆకాశాన్ని తాకిన అగ్నిజ్వాలలు!
Full rains: ఈ జిల్లాలో ప్రజలకు హెచ్చరికలు.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం! 30 గొర్రెలు మృతి, మగ్గురికి గాయాలు!
ఇకపై కెమికల్ డై అవసరం లేదు.. తెల్ల జుట్టు మాయం చేసే సహజ మార్గం ఇదే!
AP Farmers: రైతులకు గుడ్ న్యూస్! త్వరలోనే భూ ఆరోగ్య కార్డుల పంపిణీ ప్రారంభం!
Heart disease: నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారికి గుండె జబ్బుల ముప్పు రెండింతలు.. నిపుణుల సందేశం!