మహాసముద్రాల లో చాలా బంగారం ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం ఉండవచ్చు. దీని విలువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. కానీ సమస్య ఏమిటంటే, ఈ బంగారం నీటిలో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి దాన్ని బయటకు తీయడం చాలా కష్టం.
మహాసముద్రాలు భూమి ఉపరితలంలో 71% భాగాన్ని కవర్ చేస్తాయి. కానీ ప్రతి 100 మిలియన్ టన్నుల నీటిలో కేవలం ఒక గ్రాము బంగారం మాత్రమే ఉంటుంది. అంటే ఒక లీటరు నీటిలో బంగారం చాలా తక్కువగా ఉంటుంది. నేటి ధరల ప్రకారం, ఒక టన్ను బంగారం సుమారు $106.3 మిలియన్ల విలువ కలిగి ఉంటుంది.
బంగారం సముద్రంలోకి ఎలా వస్తుంది అంటే, వర్షాలు, నదులు, నదీ ప్రవాహం ద్వారా భూమిలోని చిన్న బంగారపు ముక్కలు సముద్రానికి చేరుతాయి. సముద్రపు లోతులోని వేడి నీటి బుగ్గలు, గాలి కూడా కొన్ని బంగారపు ధూళిని సముద్రానికి తీసుకువెళ్తాయి. మధ్యధరా, అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్ సముద్రాల్లో ఎక్కువ బంగారం ఉంటుంది.
గతంలో శాస్త్రవేత్తలు సముద్రపు నీటిలోని బంగారం తీయడానికి ప్రయత్నించారు. 1941లో విద్యుత్తు ఉపయోగించే పద్ధతిని సూచించారు, కానీ అది ఖర్చుతోసమస్య. 2018లో ప్రత్యేక స్పాంజ్ మెటీరియల్ ద్వారా కొన్ని నిమిషాల్లో బంగారం తీయగలిగారు. కానీ మహాసముద్రాల స్థాయిలో ఉపయోగించడం చాలా కష్టం.
ప్రస్తుతం సముద్రాల నుంచి బంగారం తవ్వడం సులభం కాదు. టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. కానీ భవిష్యత్తులో కొత్త పద్ధతులు, కొత్త మెటీరియల్స్ తో ఓషన్ గోల్డ్ మైనింగ్ సాధ్యమవ్వచ్చు. అంతే కాకుండా, చంద్రుడు, గ్రహశకలాలు వంటి ప్రదేశాల్లో కూడా విలువైన లోహాలను తవ్వడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.