Road Development: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! ఆ రూట్ లో నాలుగు లైన్లుగా...డీపీఆర్ సిద్ధం! అక్కడికి తగ్గనున్న దూరం!

జామ పండును పేదవాడి యాపిల్ అని వైద్యులు పేర్కొంటారు. కారణం ఏమిటంటే, యాపిల్‌లో ఉన్న అనేక పోషకాలు జామ పండులో కూడా లభిస్తాయి. మన ఇళ్లలో సులభంగా లభించే ఈ పండు విటమిన్ సీ శాతం ఎక్కువగా కలిగి ఉంటుంది. అదేవిధంగా ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా జామలో అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలుకలిగించే పండుగా గుర్తింపు పొందింది.

గుడ్ న్యూస్ ఆ దేశంలో కేవలం రూ. 12 వేల లోపే పర్మనెంట్ రెసిడెన్సీ అప్లికేషన్.! భారతీయ పౌరులు అర్హులే.!

బరువు తగ్గాలని కోరుకునే వారికి జామ పండు అద్భుతమైన ఎంపికగా వైద్యులు సూచిస్తున్నారు. ఈ పండు తినడం వలన ఆకలి నియంత్రణలోకి వస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచుగా జామ పండు తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. అలాగే ఇందులో ఉండే కాపర్, ఇతర ఖనిజాలు హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడుతూ థైరాయిడ్ జీవక్రియలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

తిరుమలలో నేటి నుండి సాలకట్ల బ్రహ్మోత్సవాలు! పాల్గొననున్న సీఎం చంద్రబాబు!

జామ పండులో విటమిన్ A కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో కూడా జామ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అదనంగా ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తపోటుతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ కారణాల వలన రోజువారీ ఆహారంలో జామ పండు చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే మీ కాలేయం ప్రమాదంలో ఉన్నట్లే.! ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ ని సంప్రదించండి!

అయితే, జామ పండు ప్రతి ఒక్కరికీ అనుకూలం కాదు. జీర్ణ సమస్యలు, ఇరిగేటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు దీనిని తప్పుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కారణం, జామ పండులోని విత్తనాలు జీర్ణం కావడం కష్టతరం. ఇది కడుపు నొప్పి, అజీర్ణం, తిమ్మిరి వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు కూడా దీనికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు అస్వస్థత..! అధికారిక కార్యక్రమాలకు తాత్కాలిక విరామం..!

అలాగే జలుబు లేదా దీర్ఘకాలిక సైనస్ సమస్యలతో బాధపడే వారు ముఖ్యంగా శీతాకాలంలో జామ పండును తీసుకోవడం నివారించాలి. ఎందుకంటే ఈ పండు శరీరానికి చల్లదనాన్ని పెంచే లక్షణం కలిగి ఉంటుంది. అందువల్ల జామ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించినప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా మాత్రమే దీన్ని తీసుకోవాలి.

CRDA office: రాజధాని కలకు ప్రతీకగా నిలవబోయే CRDA కార్యాలయం.. విజయదశమి రోజున ప్రారంభానికి!
ప్రపంచంలో ఏ దేశం దగ్గర అత్యధిక బంగారం ఉంది? నంబర్ 1 స్థానంలో - భారత్ ఎన్నో స్థానం అంటే.!
ITI Hostel: మధురై ఐటీఐ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం.. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం.. జూనియర్ బట్టలు విప్పించి!
Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!
Praja Vedika: నేడు (24/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!